టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతుంది రష్మీక మందన్నా. కన్నడ ఇండ్రస్టీ నుంచి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తెలుగులో మంచి అవకాశాలు దక్కించుకుంటూ.. తన అందం, అభినయంతో అందర్నీ అలరిస్తూ స్టార్ స్టేటస్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తుంది ఈ భామ. ఇదిలా ఉంటే రష్మీక కన్నడలో నటించిన ఓ సినిమా ఇప్పుడు తెలుగులో విడుదల కానుంది.ఈ సినిమాతో  కన్నడ హీరో ధృవ సర్జా  ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నాడు. కరాబు మైండు కరాబు మెరిసే కరాబు నిలబడి చూస్తావా రుబాబు.. అంటూ తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన పొగరు సాంగ్ ని ఎవరూ మర్చిపోలేరు.

కన్నడలో ఈ సాంగ్ విడుదలయ్యిన దగ్గర నుండి మిలియన్స్ మిలియన్స్ వ్యూస్ తో రికార్డులు సాదించింది. తరువాత తెలుగులో కూడా తన పొగరు చూపించాడు కన్నడ స్టార్ హీరో దృవ సర్జా. ఈ ఏడాది కన్నడలో హఠాన్మరణం చెందిన చిరంజీవి సర్జా తమ్ముడు ఈయన.పొగరు అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం పొటీ పడగా 3 కోట్లకి పైగా ఫ్యాన్సీ రేటుతో వైజాగ్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌, ఫైనాన్సియర్, ప్రోడ్యూసర్ డి.ప్రతాప్ రాజు సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో సాయిసూర్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై విడుదల చేస్తున్నారు. ఈ సినిమా సాంగ్ కన్నడలో 170 మిలియన్స్ పైగా వ్యూస్ తెలుగులో 43 మిలియన్స్ వ్యూస్ కి పైగా రావటంతో సినిమాపై ఆసక్తి బాగా పెరిగిపోయింది.

 దానికి తోడు ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది.తెలుగులో ప్రస్తుతం ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రష్మిక అడుగుపెట్టిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. ఈ నమ్మకంతోనే ఇప్పుడు పొగరు సినిమాకు కూడా ఇంత రేట్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ సినిమా తెలుగు, కన్నడ బాషల్లో ఒకేసారి విడుదల కి సన్నాహలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో రష్మీకకు ఉన్న క్రేజ్ వల్లనైనా ఇక్కడ విజయం సాధిస్తుందా చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: