దానికి తోడు ఈ సినిమాలో మన మెగాస్టార్ ఓ మాజీ నక్సలైట్ గా కూడా కనిపించనున్నారట. ఇదిలా ఉంటె కరోనా తో బ్రేక్ పడ్డ ఈ మూవీ షూటింగ్ ఇటీవలే మొదలై కొంత మేర షూటింగ్ జరుపుకుని కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తోంది. అదేంటంటే..'ఈ సినిమా కోసం ఇటీవల కేరళలోని ఒక గ్రామం సెట్ను హైదరాబాద్లో వేశారు. దానికి సుమారు రూ.20 కోట్లు ఖర్చు కూడా అయింది. ఈ సెట్ దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంతో వేశారు'. మొదటిగా గుడి సెట్ కోసం నాలుగు కోట్లు ఖర్చు అయింది.
అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను కూడా షూట్ చేశారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసే దిశగా ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు..ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ మరో రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి లూసిఫార్ రీమేక్ కాగా.. మరొకటి అజిత్ తమిళ సినిమా వేదళం రీమేక్. ఇందులో మొదటగా మలయాళ మూవీ లూసిఫార్ రీమేక్ పట్టాలెక్కనున్నట్టు సమాచారం...!!