కళ్యాణమొచ్చినా.. కక్కొచ్చినా ఆగదు. ఇది చాల పాత సామెత అయినా కూడా టాలీవుడ్ లో చాల మందికి వర్తిస్తుంది. ఎప్పటి నుండి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ గా చలామణి అయినా టాప్ స్టార్స్ లాక్ డౌన్ లో కల్యాణ గడియలు రాగానే మూడు మూళ్ళ బంధం తో తమ సోలో లైఫ్ కి పార్టనర్ ని తెచ్చుకున్నారు.. ఎంత ఆడంబరంగా అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరగాల్సిన ఈ స్టార్స్ పెళ్లిళ్లు, లాక్ డౌన్ లో కేవలం నలుగురైదుగురు మధ్యలో జరిగిపోయాయి. కల్యాణ గడియ వస్తే కరొనకి భయపడం అంటూ 2020 లో పెళ్లిళ్లు చేసుకున్న సెలబ్రిటీలు ఎవరో ఓసారి చూసేద్దాం రండి.

మొదటగా, దిల్ రాజు:  స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తేజస్వి అనే అమ్మాయిని 2020లోనే రెండో పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్య అనిత 2017 లో హఠాత్తుగా కన్ను మూయగా. కూతురి మాట కోసం ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు.

నితిన్ : కరోనా లాక్ డౌన్ టైంలోనే  షాలిని అనే యువతిని అతి తక్కువ మంది సమక్షంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు నితిన్.

నిఖిల్ : ఇంకా ఈ హీరో పల్లవి వర్మ అనే డాక్టర్ తో కొన్నేళ్లుగా ప్రేమలో ఉండి, లాక్ డౌన్ లో పెళ్లితో ఒక్కటయ్యారు

రానా : ఈ పేరు చెప్తే ఇండస్ట్రీ లో ఒక విబేర్షన్ ఉంటుంది. తన బ్యాచ్ మేట్స్ అందరు పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వగా ఒక్క రానా మాత్రమే మిగిలాడు. ఇతను కూడా మిహీక బజాజ్ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

రాజా చెంబోలు : ప్రముఖ నటుడు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అబ్బాయి అయినా రాజా, హిమబిందు  అనే అమ్మాయిని ఈ మధ్యనే పెద్దలు కుదిర్చగా పెళ్లి చేసుకున్నాడు.  

‘రంగస్థలం’ మహేష్ : జబర్దస్త్  ఫేమ్ మహేష్ కాస్త రంగస్థలం సినిమాతో పేరు రంగస్థలం ఫేమ్ అనిపించుకునేలా పేరు సంపాదించుకున్న మహేష్ పావని అనే యువతిని లాక్ డౌన్ లోనే పెళ్లి చేసుకున్నాడు.
 
నీతి టైలర్ : ఆగష్టు లో నీతి టైలర్ పరీక్షిత్ అనే యువకుడిని పెళ్లాడింది. ఈమె మేం వయసుకు వచ్చాం సినిమాతో తెలుగు వారికి పరిచయమే.

 సనా ఖాన్: మిస్టర్ నూకయ్య’, కత్తి సినిమాల్లో నటించిన సనా సైతం ఇటీవలే పెళ్లి చేసుకుంది

 షాలిని వడ్నికట్టి : ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ఫేమ్ షాలిని సైతం ఈ ఏడాది కరోనా సమయంలోనే పెళ్లాడింది.

 కాజల్ అగర్వాల్ :  ఇక ప్రముఖ బిజినెస్ మ్యాన్, తన చిన్ననాటి మిత్రుడు అయినా గౌతమ్ కిచ్లుని ఎన్ని ఏళ్ళ పాటు ప్రేమించి 2020 లోనే పెళ్లి చేసుకుంది కాజల్. 

మరింత సమాచారం తెలుసుకోండి: