ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...యంగ్ టైగర్ ఎన్టీఆర్, క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో 2016లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ‘ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును’ అన్న ట్యాగ్‌లైన్‌తో ఓ వైపు పాడైన వాహనాలను, మరోవైపు అన్యాయం చేసే వ్యక్తుల్ని కథానాయకుడు దారిలో పెడుతుంటాడు. అప్పటికి సూపర్ స్టార్ మహేష్ బాబు తో "శ్రీమంతుడు" లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మంచి జోష్ లో వున్నాడు కొరటాల.. ప్రకృతి ప్రేమికుడిగా, తప్పుచేసే వాళ్లని ఎదిరించే యువకుడిగా ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాలో ఒదిగిపోయాడు. ఇందులో ఆయన చెప్పిన డైలాగులు, స్టెప్పులుకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ చిత్రానికి మరో అదనపు ఆకర్షణగా నిలిచారు మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్. మెకానిక్‌ సత్యం పాత్రలో నటించి ఎంతగానో ఆకట్టుకున్నాడు.

అయితే సత్యం పాత్రలో నందమూరి బాలకృష్ణ నటిస్తే ఎలా ఉండేదో ఊహించుకోండి. పైగా బాబాయ్, అబ్బాయ్ ఒకే సినిమాలో కనిపిస్తే నందమూరి అభిమానులకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది.‘జనతా గ్యారేజీ’ సినిమాలో బాలకృష్ణ నటిస్తున్నారంటూ అప్పట్లో జోరుగా వార్తలు రావడంతో నందమూరి ఫ్యాన్స్‌ ఖుషీ అయిపోయారు. చివరికి ఆ పాత్రకు మోహన్‌లాల్‌‌ని సెలక్ట్ చేశారు దర్శకుడు కొరటాల శివ దీనిపై గతంలో సోషల్‌మీడియా ద్వారా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు కొరటాల శివ ఇలా సమాధానమిచ్చారు. ‘తారక్, బాలయ్య కలయికలో సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఈ కాంబినేషన్లో వచ్చే సినిమాలో వాళ్లిద్దరి మధ్య సన్నివేశాలు ఎలా ఉంటాయో అని ఎదురు చూస్తారు తప్ప కథని ఎవరూ పట్టించుకోరు. జనతా గ్యారేజ్ మంచి కథా బలం ఉన్న సినిమా. ఆ పాత్రకు బాలయ్య అంతగా సూటవ్వరని అనిపించే ఆయన్ని సంప్రదించలేదు. భవిష్యత్తులో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రావొచ్చేమో’ అని చెప్పుకొచ్చారు.ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి....

మరింత సమాచారం తెలుసుకోండి: