బద్రి సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్ , రేణు దేశాయ్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు .. కొన్ని రోజుల పాటు జీవితం సాఫీగా సాగింది.. అంతేకాదు వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.. ఏమైందో ఏమో తెలియదు ఇద్దరు విడిపోవడం జరిగింది .. ఆ తర్వాత పవన్ రాజకీయాలలో బిజీగా ఉండగా, రేణు దేశాయ్ సినిమాల వైపు అడుగులు వేసింది దర్శకురాలిగా మరియు నిర్మాతగా రాణించింది ఆ తర్వాత సినిమాలకి స్వస్తి చెప్పి తన పిల్లలతోనే గడుపుతుంది ..
రేణు దేశాయ్ ప్రస్తుతం పూణేలో తన నివాసంలో పిల్లలతో కలిసి ఉంటుంది.. .అయితే రేణు దేశాయ్ ఒక మరాఠీ చిత్రానికి దర్శకత్వం వహించింది అంటే మీరు నమ్ముతారా! రేణు దేశాయ్ ఒక సినిమాకి దర్శకత్వం వహించిన విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలీదు..అది కూడా మరాఠి భాషలో 2014 సంవత్సరంలో ఇష్క్ వాలా లవ్ అనే ఒక మరాఠి చిత్రానికి రేణు దేశాయ్ దర్శకత్వం వహించారు.. ఈ సినిమాని రేణుదేశాయ్ నిర్మించడం విశేషం...
రేణు దేశాయ్ తెలుగు లో బద్రి సినిమాతో పాటు ,జానీ అనే మరో చిత్రం లో నటించింది .. ఆ సినిమాలో కూడా హీరోగా పవన్ కళ్యాణ్ నటించారు ..అయితే చాలా రోజుల గ్యాప్ తర్వాత రేణు దేశాయ్ మళ్ళీ కెమెరా ముందుకు రాబోతున్నట్లు సమాచారం ..