సూపర్ స్టార్ మహేష్ తన సినిమాల లిస్ట్ పెంచేస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు తర్వాత పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా ఫిక్స్ చేసుకున్నాడు మహేష్. ఈ సినిమా ఈమధ్యనే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోగా 2021 జనవరి నుండి సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ తో మహానటి కీర్తి సురేష్ జోడీ కడుతుంది. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి, త్రివిక్రం డైరక్టర్స్ తో సినిమా చేస్తాడని టాక్.

ఇదిలాఉంటే ఛలో, భీష్మ ఫేం వెంకీ కుడుములతో మహేష్ సినిమా చేస్తాడని అంటున్నారు. ఛలోతో డైరక్టర్ గా టాలెంట్ చాటి.. భీష్మతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు వెంకీ కుడుముల. త్రివిక్రం శిష్యుడిగా బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన వెంకీ తన థర్డ్ మూవీ ఎవరితో చేస్తాడో తెలియాల్సి ఉంది. అయితే భీష్మ డైరక్టర్ సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేస్తాడని అంటున్నారు. ఈమధ్యనే మహేష్ ను కలిసి కథ వినిపించాడత వెంకీ కుడుముల. మహేష్ కూడా కథ బాగుందని చెప్పాడట.

ఛలో, భీష్మ రెండు హిట్లు కొట్టిన వెంకీ మీద మహేష్ కూడా నమ్మకం పెడుతున్నాడని తెలుస్తుంది. అయితే వెంకీ కుడుముల చరణ్ కోసం కూడా ఒక కథ సిద్ధం చేశాడట. చరణ్ తో సినిమా ఏమైందో ఏమో కాని మహేష్ తో సినిమా లైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మహేష్ వెంకీ కాంబో కుదిరితే మాత్రం సూపర్ ఎంటర్టైనర్ వచ్చినట్టే.                                              
 

మరింత సమాచారం తెలుసుకోండి: