యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధా కృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమాను యువి క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే. సినిమా నుండి వచ్చిన పోస్టర్స్ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే రాధే శ్యామ్ తో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు ప్రభాస్.

ఇక ఈ సినిమాలో ఓ సూపర్ సీన్ అదిరిపోతుందని అంటున్నారు. సినిమాలో అండర్ వాటర్ ఫైట్ సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని టాక్. పిరియాడికల్ లవ్ స్టోరీగా వస్తున్న రాధే శ్యామ్ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని అంటున్నారు. ప్రభాస్, పూజా హెగ్దేల జోడీ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని చెబుతున్నారు.

దాదాపు షూటింగ్ ముగింపు దశకు చేరుకోగా ఈ సినిమాను పూర్తి చేసి ఆదిపురుష్, సలార్ సినిమాల షూటింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాలతో పాటుగా నాగ్ అశ్విన్ సినిమా కూడా ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్నారు. 2021 చివర్లో ఆ సినిమా కూడా మొదలవుతుందని తెలుస్తుంది. ప్రభాస్ ఇక మీదట చేసే సినిమాలన్ని పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్నాయి. నేషనల్ వైడ్ క్రేజ్ తో యంగ్ రెబల్ స్టార్ దూసుకెళ్తున్నాడని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: