బాహుబలి స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలో అనౌన్స్ చేసి బిజీబిజీగా ఉన్నాడు ప్రస్తుతం ఆయన రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యాం అనే సినిమా చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.. పీరియాడిక్ మూవీ కావడం అలానే ప్రభాస్ నుంచి లవ్ స్టోరీ వచ్చి చాలా సంవత్సరాలు దాటిపోవడంతో ఈ సినిమా మీద మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కి కొత్త టెన్షన్ వచ్చి పడింది. ప్రస్తుతం ప్రభాస్ మరో రెండు సినిమాలు కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. 


అందులో ఒకటి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ కాగా మరొకటి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆది పురుష్. నాగ్ అశ్విన్ సినిమా కంటే ముందే ఈ సినిమా తెరకెక్కనుంది. రామాయణ ఇతిహాస నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ కనిపిస్తుండగా రావణుడిగా ali KHAN' target='_blank' title='సైఫ్ అలీఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ ప్రభాస్ ఫ్యాన్స్ లో టెన్షన్ పెడుతున్నాయి. 



తాజాగా ఈ సినిమా గురించి సైఫ్ అలీ ఖాన్ స్పందిస్తూ ఇప్పటి దాకా అన్ని సినిమాలలో రావణాసురుడిని ఒక విలన్ లాగా చిత్రీకరించారని కానీ మా సినిమాలో ఆయనలో ఉన్న మానవత్వపు కోణాన్ని చూపిస్తామని చెప్పుకొచ్చాడు. అంటే ఒక రకంగా ఇప్పటి దాకా విలన్ లాగా చూపించిన వ్యక్తిని మా సినిమాలో హీరోని చేస్తున్నామని ఆయన చెప్పినట్టే. ఇప్పుడు ఇదే పాయింట్ ప్రభాస్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోంది. ఎందుకంటే మామూలుగానే హిందువులు తమ పురాణాల గురించి ఇతిహాసాల గురించి ఎవరైనా కామెంట్ చేస్తే ఊరుకోరు. అలాంటిది వారు రాక్షసుడిగా భావించే వ్యక్తిని హీరోగా చూపెట్టే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది అనేది ఇప్పుడు టెన్షన్ పెడుతోంది. చూడలి మరి ఏమవుతుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి: