సింహా', 'లెజెండ్' చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్‌ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ 106వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైనప్పటికీ ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోయింది.ఇక ఇటివలే ఈ చిత్ర షూటింగ్ మొదలై శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది.  ప్రస్తుతం బోయపాటి  చిత్రంతో పాటు మరో రెండు సినిమాలు ఓకే చేసారు మన బాలయ్య. తాజా సమాచారం ప్రకారం రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలయ్య అందులో ఒక సినిమాని కొత్త దర్శకుడు డైరక్ట్ చేయనున్నారు.యువ హీరో నాగ శౌర్య ఆ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. అలాగే 'బలరామయ్య బరిలో దిగితే..' అనే టైటిల్ తో రూపొందే చిత్రానికి సైతం ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

 డైరక్టర్  సంతోష్‌ శ్రీనివాస్‌ ఈ కథను రెడీ చేసినట్లుగా తెలుస్తోంది.ఇక బాలయ్య - సంతోష్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్ లో ఈ కథని తెరపైకి తీసుకెళ్లేందుకు ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సన్నాహాలు చేస్తోంది.సంతోష్ శ్రీన్‌వాస్‌ ఇప్పటికే కందిరీగ, హైపర్ చిత్రాలతో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు    తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో `అల్లుడు అదుర్స్‌` తీస్తున్నాడు ఈ దర్శకుడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇది పూర్తయిన వెంటనే బాలకృష్ణ సినిమా ప్రారంభించనున్నాడు సంతోష్ శ్రీనివాస్. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ వాళ్లు ఈ కథ విని  వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో ఆ ప్రొడక్షన్ సంస్ద వారే బాలయ్యని లాక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.

ఈ మేరకు `బలరామయ్య బరిలోకి దిగితే..` అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారు.ఇక ఈ సినిమాల తర్వాత బాలయ్య. బి.గోపాల్ తో ఓ సినిమా చేయాల్సివుంది. మరో ప్రక్క శ్రీవాస్ కూడా బాలయ్య కోసం ఓ కథ రెడీ చేస్తున్నట్టు సమాచారం అందుతోంది.శ్రీవాస్ డైరెక్ట్ చేయనున్న ఈ మూవీ కథను ప్రముఖ రచయిత కోన వెంకట్ కథను అందిస్తున్నారు. ఇటీవలే ఈ కథను బాలయ్యకు వినిపించగా.. అదిఆఆయనకు బాగా నచ్చి.. వెంటనే ఓకే చెప్పునట్లు తెలుస్తోంది. మొత్తానికి కొద్ది రోజులుగా కాస్త స్లో అయిన మన బాలయ్య..ఇప్పుడు వరుస చిత్రాలను లైన్లో పెడుతున్నాడు.ఇక బాలయ్య, బోయపాటిమూవీ వచ్చే ఏడాదిలో విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: