తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫోర్ చివరి అంకానికి చేరుకుంది. మరో రెండు మూడు వారాల్లో ఈ షో కి శుభం కార్డు వేసే సమయం దగ్గర పడింది. దీంతో ఈ షో ఇప్పుడు రసవత్తరంగా మారింది అని చెప్పవచ్చు. అయితే గత సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ కోసం తీసుకున్న కంటెస్టెంట్స్ జనాన్ని మెప్పించలేక పోతున్నారని చెప్పొచ్చు. గత సీజన్లో చాలా వరకూ ప్రేక్షకులకు తెలిసిన మొహాలు ఉండేవి. కానీ ఇప్పుడు ప్రేక్షకులు వీరి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. 


ఒక రకంగా వీరు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నారని చెప్పవచ్చు. దీంతో గత సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ టి ఆర్ పి లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సీజన్ ఫినాలే ని అయినా గ్రాండ్ గా ప్లాన్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేకి మహేష్ బాబు చీఫ్ గెస్ట్ గా వచ్చి విన్నర్ కి అవార్డు అందించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి పుకారే అయినా ఈ అప్ డేట్ మాత్రం నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 


ఎందుకంటే గత సీజన్ గ్రాండ్ ఫినాలే కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చి అప్పటి సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కి కప్ అందించి శుభాకాంక్షలు తెలిపి వెళ్లారు. ఇప్పుడు కూడా అదే ఫార్మెట్ ఫాలో అయి సూపర్ స్టార్ మహేష్ బాబుని నిర్వాహకులు తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా మహేష్ బాబు ఇలాంటి షోలకు రాడు, మరి బిగ్ బాస్ ఆయన్ని ఎలా తీసుకువస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: