ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ప్రముఖ మాజీ  హీరోయిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి  భార్య, రచయిత రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ తో విడాకులు తరువాత  తన పిల్లలు ఆద్య, అకీరాలతో చాలా సంతోషంగా వుంది. తాజాగా ఒక ప్రోగ్రామ్ లో తన పిల్లల గురించి మాట్లాడుతూ చాలా  ఎమోషనల్ అయ్యింది.ప్రస్తుతం ఆ సంఘటన పలువురు పవర్ స్టార్ ఫ్యాన్స్ ని బాధకు గురి చేస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే... రేణు దేశాయ్ తాజాగా సుమ హోస్టింగ్ చేస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొని తన పిల్లలిద్దరి గురించి చెబుతూ కన్నీరు పెట్టుకుంది. పవన్‌తో విడాకుల అనంతరం ఆద్య, అకీరాలను తన వద్దే ఉంచుకొని వారి ఆలనాపాలనా చూసుకుంటూ వారి వారి భవిష్యత్ ప్రణాళికలో కీలక భూమిక పోషిస్తోంది రేణు దేశాయ్. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్‌తో స్పెషల్ ప్రోగ్రాం ప్లాన్ చేసి ఆమె బర్త్ డే కానుకగా ప్రసారం చేసింది యాంకర్ సుమ.


ఇక స్వయంగా  సుమక్క పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన సుమ.. సెలబ్రిటీలను గెస్టులుగా పిలిచి వారితో వంట కార్యక్రమాలు చేస్తూ తన మాటల తూటాలతో ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో రేణు దేశాయ్‌ని గెస్టుగా పిలవగా సుమతో సరదాగా మాట్లాడుతూనే ఆమెనే ఆటపట్టించింది రేణు. ఎంతో ఫన్ క్రియేట్ చేస్తూ సాగిపోయిన ఈ షోలో తన పిల్లలు ఆద్య, అకీరాల గురించి మాట్లాడిన రేణు దేశాయ్ కళ్లలో ఆనందబాష్పాలు కనిపించాయి.


'బెస్ట్‌ మామ్‌ ఎవర్‌' అంటూ ఓ టీ కప్పుపై పిల్లలతో దిగిన ఫోటోను వేసి రేణుకి గిఫ్ట్‌గా ఇచ్చింది సుమ. దీంతో ఆద్య, అకీరాలే తనకు సర్వస్వం అని చెబుతూ ఎమోషనల్ అయింది రేణు దేశాయ్. తన పిల్లలిద్దరూ ఏదైనా ఫంక్షన్స్ లేదా పవన్ షూటింగ్స్‌కి వెళ్ళినప్పుడు అక్కడి డైరెక్టర్లు, నటీనటులు ఆ ఇద్దరినీ చూసి తనకు ఫోన్ చేసి వారి గురించి మాట్లాడేవారని చెప్పింది. మీ ఇద్దరు పిల్లలు చాలా చాలా చక్కగా ఉన్నారు, అందరితో కలసి పోతున్నారు అని చెప్పినప్పుడు ఒక తల్లిగా ఆ క్షణాలు తనకెంతో సంతోషం కలిగించేవని తెలిపింది రేణు.ఇక ఈ వీడియో చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక ఇలాంటి మరెన్నో అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో మూవీ విశేషాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: