గోపికమ్మా చాలునులేమ్మా నీ నుదురా అంటూ అచ్చ తెలుగు అమ్మాయిలా తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిని కన్నడ బ్యూటీ క్వీన్ పూజా హెగ్డే.. అందం, అభినయంతో కుర్రకారు మనసును కొల్లగొట్టి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది ఈ బుట్టబొమ్మ. మంచి హిట్ అందుకున్న ముకుంద సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది ఈ హాట్ బ్యూటీ. ఆ తర్వాత నాగచైతన్యతో ఒక లైలా కోసం అనే సినిమాలో అబ్బురపరిచే నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అక్కడితో ఆగకుండా ప్రముఖ స్టార్ హీరోల సరసన నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది . అల్లుఅర్జున్ సరసన అలా వైకుంఠపురంలో, మహేష్ జతన మహర్షి లో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి అరవింద సమేతలో నటించి ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది ఈ చిన్నది.

అలాగే ఈ బ్యూటీ ఫోటో గ్యాలరీ చూసి కుర్రకారు మనసు పారేసుకుంటున్నారు. కిక్కెక్కించే హాట్ హాట్ ఫోజులతో ఈ కుర్రది యువత మనసును దోచుకుంటోంది. వరుస విజయాల రాకతో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్ల మీద ఆఫర్లు బాగానే వస్తున్నాయి. ప్రముఖ స్టార్ కథానాయకల సరసన నటిస్తూ ప్రముఖ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం ఇటు టాలీవుడ్ లోనూ, అటు బాలీవుడ్ లోనూ వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ రణ్ వీర్ సింగ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సర్కస్ అనే మూవీలో కథానాయికగా నటిస్తున్న విసయం తెలిసిందే. అయితే ఈ సర్కస్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో ఈ హాట్ బ్యూటీ రాదే శ్యామ్ కోసం సంసిద్ధమవుతోంది. 

అందుకే రాధేశ్యామ్ కోసం పూజ హైదరాబాద్ చేరుకుంది. ఇప్పటి నుంచి రాధేశ్యామ్ కోసం ఫుల్ ప్రిపేర్ గా పూజా ఉండబోతోందని అర్థమవుతోంది. అయితే రాధేశ్యామ్ చిత్ర యునిట్ ఓ మేజర్ షెడ్యూల్ ను ఇటలీలో షూటింగ్ ను కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఆ తర్వాత హైదరాబాద్ లోనే రాధేశ్యామ్ మరో షెడ్యూల్ ను నిర్వహించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ షెడ్యూల్ లో భాగంగా హీరో ప్రభాస్, హీరోయిన్ పూజా హెగ్డేలపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట. ఈ సినిమా వచ్చే వేసవిలో విడుదల కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ డార్లింగ్ ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్ లో వస్తున్న రాధేశ్యామ్ పట్ల అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: