రాజకుమారుడితో వెండితెరకు హీరోగా పరిచయమై ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న స్టార్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆ సినిమాకు నంది ఉత్తమ నటుడిగా పురస్కారం చేసుకున్నఘనత మహేశ్ బాబుకే సొంతం. అదిరిపోయే స్టైల్ తో కుర్రకారు ఫ్యాషన్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాడు మహేశ్ బాబు. ఎన్ని ప్రముఖ సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపును పొందుతున్నాడు ఈ హీరో.. చిన్నచిన్న సినిమాలతో మొదలుపెట్టి ఇప్పుడు ఏ సినిమా తీసినా రికార్డులు సొంతం చేసుకునేలా నటిస్తున్నారు ఈహీరో. ప్రస్తుతం ఈ హీరో వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. 

ఇదిలా ఉంటే ఏడాది ఆరంభంలోనే ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ మాంచి గుర్తింపును తన ఖాతాలో వేసుకున్నారు ఈ హీరో. అయితే ప్రస్తుతం ఈ హీరో ‘సర్కారి వారి పాట’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నటిస్తున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే పవర్ స్టార్, సూపర్ స్టార్ కాంబినేషన్ నిజంగానే సినిమా రాబోతోందని ఆ చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. దీంతో అటు మహేశ్ ఫ్యాన్స్, ఇటు పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారనిపిస్తుంది. అయితే ఈ సర్కారి వారి పాట సినిమాపై ఆయన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారని అర్థమవుతోంది. 

అయితే సినిమాల్లో హీరోగానే కాకుండా వేరే సినిమాలకు కూడా ఈ హీరో వాయిస్ ఓవర్ ను కూడా అందించారు. ఇదిలా ఉంటే ఈ సూపర్ స్టార్ తన అభిమానులకు తన కొత్త లుక్ ను పంచుకున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉండే ఈ హీరో తాజాగా ఓ బ్రాండ్ షూట్ లో పాల్గొన్నాడు. ఆ సందర్బంగా ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ అవినాశ్ గోవరికర్ మహేశ్ బాబును ఫోటోలు తీసారు. ఆ ఫోటోలను మహేశ్ షేర్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: