ఇటీవలే అక్షయ్ కుమార్ సరసన లక్మి సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ అమ్మడు.. త్వరలోనే మరో హిందీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో భాగంగానే ఇటీవలే ఈమె ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ప్రేమ, పెళ్లి అంశాల్లో తన ఆలోచనా విధానం పూర్తి సంప్రదాయబద్దంగా ఉంటుందని చెప్పింది కియారా అద్వాణీ. కొత్తతరం అమ్మాయినైనా ప్రేమ విషయంలో ఆధునిక భావాల్ని వంటపట్టించుకోలేదని పేర్కొంది. ఆమె కథానాయికగా నటిస్తున్న తాజా హిందీ చిత్రం 'ఇందూ కి జవానీ' ఈ నెల 11న ప్రేక్షకులముందుకురానుంది.డేటింగ్ యాప్స్ నేపథ్యంలో నేటితరం యువతీయువకుల ఆలోచనారీతుల్ని ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా విడుదల సందర్భంగా మాట్లాడిన కియారా అద్వాణీ తనకు డేటింగ్పై అస్సలు నమ్మకం లేదని చెప్పింది.
'డేటింగ్ యాప్స్ సంస్కృతిని నేను ఇష్టపడను. పాతకాలంలో మాదిరిగా స్వచ్ఛమైన, నిజాయితీతో కూడిన ప్రేమపట్ల నాకు విశ్వాసం ఉంది.ప్రేమ విషయంలో నేను పాత ఆచారాల్ని నమ్ముతాను. మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లాడి జీవితాంతం అతనితో కలిసి ఉండాలనుకుంటా' అంటూ చెప్పింది కియారా అద్వానీ. ఇక ఇప్పుడు తెలుగులో.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఈ భామనే తీసుకున్నట్లు సమాచారం..దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది...!!