టాలీవుడ్ సినిమా పరిశ్రమకి ఈశ్వర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు రెబల్ స్టార్ ప్రభాస్. జయంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ అందుకుంది. ఆ తరువాత శోభన్ దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన వర్షం సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న ప్రభాస్, ఇక అక్కడి నుండి వరుసగా సినిమా ఛాన్స్ లు అందుకుంటూ ముందుకు దూసుకెళ్లారు. ఇక ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి రెండు సినిమాల అత్యద్భుత సక్సెస్ తో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా గొప్ప ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్, ఆ తరువాత సాహో సినిమా చేసి దానితో కూడా మంచి విజయాన్ని అందుకున్న ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగు బడా పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.
వాటిలో ముందుగా ఆయన చేస్తున్న సినిమా రాధేశ్యామ్ కాగా, అనంతరం నాగ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా, అలానే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా, అలానే ఇటీవల ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రకటించిన
సలార్ సినిమా. కాగా ఈ విధంగా భారీ పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళ్తున్న ప్రభాస్ రాబోయే మరికొద్దిరోజుల్లో వీటి సక్సెస్ తో పాన్ వరల్డ్ స్టార్ గా దూసుకెళ్లడం భారీ ఇమేజ్ ని సొంతం చేసుకోవడం ఖాయం అని అంటున్నారు విశ్లేషకులు.
వాస్తవానికి బాలీవుడ్ లో హీరోగా చేసి అక్కడి నుండి హిట్స్ ఎవరైనా కొడతారని, కానీ రీజనల్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ లు అందుకుంటూ కొట్టేవాడె నిజమైన హీరో అని ప్రభాస్ ని ఉద్దేశించి పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.మరి రాబోయే రోజుల్లో ఈ సినిమాలతో ప్రభాస్ ఏ రేంజ్ సక్సెస్ లు అందుకుంటారో చూడాలి...!!
 



మరింత సమాచారం తెలుసుకోండి: