ఇక ఈ సినిమాలో పవన్, సమంతల జోడీకి ప్రేక్షకులు, అలానే అభిమానుల నుండి మంచి పేరు దక్కింది. అయితే ఈ సినిమా తరువాత మరొక్కసారి పవన్, సమంత ల జోడీ ఇప్పటివరకు వేరొక సినిమా చేయనేలేదు. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్, ఆ తరువాత మరొక మూడు సినిమాలు లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. కాగా వాటిలో సాగర్ కె చంద్ర దర్శకకత్వంలో తెరకెక్కనున్న మలయాళ మూవీ అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ కూడా ఒకటి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తుండగా, ఇందులో ఆయన సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనే దానిపై కొద్దిరోజుల నుండి పలువురు కథానాయికల పేర్లు పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి.
కాగా లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత అక్కినేని ఎంపికైనట్లు చెప్తున్నారు. సినిమాలో హీరోయిన్ పాత్ర ఎంతో కీలకం అయిందని, అందుకే అటువంటి పాత్రకు సమంత అయితేనే న్యాయం చేయగలరని భావించి యూనిట్ ఆమెను ఎంపిక చేసిందట. అలానే ఆమె ఈ సినిమాకి కాల్షీట్స్ కూడా కేటాయించారని, అలానే దీనికి సంబంధించి అతి త్వరలో అధికారికంగా ప్రకటన కూడా రానుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త నిజం అయితే దాదాపుగా ఏడేళ్ల గ్యాప్ తరువాత మరొక్కసారి తెరపై పవర్ స్టార్, సమంతల జోడీని చూడవచ్చు....!!