ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ స్టార్ ప్రభాస్.ప్రస్తుతం ఆయన క్రేజ్ తెలుగు వరకే కాకుండా ఇండియా అంతా వ్యాపించింది.అందువల్ల ఆయన భారీ బడ్జెట్ తో కూడిన పాన్ ఇండియా చిత్రాలే చేస్తున్నాడు.ప్రస్తుతం నటిటిస్తున్న రాధే శ్యామ్,తరువాత చేయబోయే సలార్ ,ఆదిపురూష్,మరియు నాగ్ అశ్విన్ తో చేయబోయే సినిమా అన్నీ కూడా భారీ బడ్జెట్ చిత్రాలే.

అయితే ప్రభాస్, నాగ్ అశ్విన్, కాంబినేషన్ లో రూపొందే సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ఓ గెస్ట్ రోల్ లో అమితాబ్ బచ్చన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ సినిమాలో గెస్ట్ రోల్ లో నటిస్తోన్నందుకు అమితాబ్ ఏకంగా 22 కోట్లు తీసుకున్నారనే వార్త ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది.ఈ సినిమాలో అమితాబ్ గారిది ఫుల్ లేన్త్ రోల్ అని తెలుస్తుంది.

అందువల్ల డేట్స్ ఎక్కువ కేటాయించాలి కాబట్టి.. అంత రెమ్యునరేషన్ ను అమితాబ్ డిమాండ్ చేశారట.అయితే ఇంతకుముందు చిరంజీవి హీరోగా రూపొందిన “సైరా” సినిమాలో అమితాబ్ ఒక కీలక పాత్ర పోషించినా.. ఆ సినిమాలో ఆయన అసలు పారితోషికమే తీసుకోకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: