ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. శ్రీ రెడ్డి మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ తో రెచ్చిపోయింది. గతంలో సినిమా పరిశ్రమలో  చీడ పురుగులున్నాయని, సినిమా అవకాశాల పేరుతో బడా బాబులే మహిళలను లైంగికంగా దోచుకొని మోసం చేస్తున్నారంటూ ఒకానొక సమయంలో రెచ్చిపోయి విజృనబించింది శ్రీ రెడ్డి .. ప్రస్తుతం చెన్నైలో మకాం వేసి సోషల్ మీడియా ద్వారా వీలుచిక్కినప్పుడల్లా విరుచుకుపడుతోంది. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులపై కన్నేస్తూ.. ఎప్పుడు ఎవరిపై ఎలాంటి ఆటం బాంబ్ విసురుతుందో అర్థంకాకుండా బిహేవ్ చేస్తోంది. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ టార్గెట్‌గా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ఆమె తాజాగా పవన్ కళ్యాణ్‌పై, నాగబాబుపై షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇక ఈ మధ్య హోరా హోరీగా జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున  పవర్ స్టార్ తీసుకున్న నిర్ణయాలపై జనాల్లో చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇష్యూపై ఓ వైపు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా.. ఆయన కామెంట్స్‌పై నాగబాబు , బండ్ల గణేష్ స్పందించడంతో చర్చలు మరింత ముదిరాయి. ఈ నేపథ్యంలో జోక్యం చేసుకున్న శ్రీ రెడ్డి.. పవన్‌పై సంచలన కామెంట్స్ చేస్తూ ఓ వీడియో వదిలింది.

''ప్రకాష్ రాజే కాదు.. మొత్తం ఆంధ్ర, తెలంగాణ అంతా పవన్ కళ్యాణ్‌ని అడ్డమైన బూతులు తిడుతోంది. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడించి రేపొద్దున ఉండడు. జనసేన కార్యకర్తల్లోనే పవన్‌పై వ్యతిరేకత ఉంది. అభిమానులు రోజు రోజుకూ డౌన్ అవుతున్నారు. ఈ రోజు ఓ పార్టీకి సపోర్ట్ చేస్తే రేపు మరో పార్టీకి సపోర్ట్ చేస్తాడు. అసలు పవన్ కళ్యాణ్ సొంతంగా ఓ పార్టీ ఎందుకు పెట్టుకున్నట్లు? పార్టీ పెట్టుకుంటే పార్టిసిపేట్ చేయాలి.. అంతేగానీ నీ 60 మంది నామినేషన్స్ ఎందుకు వెనక్కి తీసుకున్నావ్? బ్రెయిన్ లేదా నీకు..'' అంటూ పవర్ స్టార్ పై రెచ్చిపోయింది శ్రీ రెడ్డి.ఇలాంటి  మరెన్నో ఆసక్తి  కరమైన విషయాలు  కోసం ఇండియా  హెరాల్డ్ గ్రూప్  ని ఫాలో  అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: