అఖిల్ వర్సెస్ అభి
ఈవారం టిక్కెట్ టు ఫినాలే రేస్ జరగగా, ఈ ఫినాలే మెడల్ పైన ఎక్కువ ఎపిసోడ్స్ ప్రసారం అయ్యాయి. అందువల్ల ఈ వారం జరగాల్సిన లగ్జరీ బడ్జెట్ టాస్క్ మనకు ప్రసారం కాలేదు. ఇక ప్రతి వీకెండ్ కుకింగ్ టాస్క్ లు, స్పాన్సర్ టాస్క్ పెడుతూ ఉంటారు బిగ్ బాస్ యాజమాన్యం. ఇక ఈ సారి లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో రెండు గ్రూప్ లుగా విడిపోయి ఆట ఆడారు ఇంటి సభ్యులు. ఇందులో అఖిల్ మరియు అభి లను టీమ్ లీడ్స్ గా ఉండమని చెప్పగా సోహెల్ ఈ గేమ్ కోసం సంచాలక్ గా వ్యవహరించాడు. ఈ ఆటలో ఎక్కువ ఐటమ్స్ ని కాలేచ్ట్ చేయడం కోసం వెళ్లిన అభి కి దెబ్బలు తగిలినట్టుగా గూగుసలు వినిపిస్తున్నాయి.
ఇక అభి, అవినాష్ మరియు అరియానా ఒక జట్టుగా, హారిక, మోనాల్ మరియు అఖిల్ లు ఒక జట్టుగా ఈ టాస్క్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది. జడ్జిగా సోహైల్ వ్యవహరించగా, టాస్క్ లో లగ్జరీ బడ్జెట్ ఐటమ్స్ ని చిన్న చిన్న బాక్స్ లలో కలెక్ట్ చేయాలి. అందుకోసం వెళ్లిన అభిజిత్ కి దెబ్బలు తగిలినట్టుగా తెలుస్తుంది. మరి అస్సలు నిజం ఏంటో ఎపిసోడ్ ప్రసారం అయితే కానీ తెలియదు. ఇక ఇప్పటికే రేస్ టూ ఫినాలే మెడల్ అఖిల్ గెల్చుకోగా, అవినాష్ మరియు అరియనాలలో ఈ వారం ఒకరు ఇంటికి వెళ్ళిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.