మన తెలుగు పరిశ్రమలో అనేకమంది గొప్ప నటులు సినిమాలలో రౌడీలుగా మెప్పించి ఆకట్టుకున్నారు. మెగాస్టార్  చిరంజీవి, రవి తేజ, శ్రీకాంత్ ఇప్పుడు జగ పతి బాబు లాంటివాళ్లు  కూడా రౌడీ ‌ పాత్రలు పోషించి ఆకట్టుకున్న సందర్భాలు వున్నాయి. పాతతరం హీరోల్లో  ఎన్టీఆర్, కాంతారావు, జగ్గయ్య, కృష్ణ, కృష్ణంరాజు, మోహన్‌బాబు లాంటి ఎందరో నటులు హీరోలుగానే కాకుండా విలన్లుగా నటించి ప్రేక్షకులను మెప్పించారు.

అయితే అగ్రహీరోగా తెలుగు సినీ పరిశ్రమను ఒక ఊపు ఊపిన అక్కినేని నాగేశ్వర్ రావు  మాత్రం కెరీర్లో ఎప్పుడూ రౌడీ పాత్ర పోషించలేదు.ఈ విషయం గురించి ఓ సందర్భంలో ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది. ‘నా పర్సనాలిటి, కంఠం దుష్టపాత్రలకి సరిపోవు. ప్రేక్షకులు నన్ను విలన్‌గా అంగీకరించరనిపించింది. అందుకే ఎప్పుడూ విలన్ పాత్ర పోషించలేదు’ అని నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. 1940లో ‘ధర్మపత్ని’ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన అక్కినేని నాగేశ్వరరావు సుమారు 250 సినిమాల్లో నటించారు.

2014లో అక్కినేని కుటుంబం తో తీసిన ‘మనం’ ఆయన ఆఖరి సినిమా.ఆ సినిమా ఆయన చనిపోయిన తరువాత విడుదలైంది. ఇంకా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: