చరణ్ ఉండే అర్ధగంట ఎపిసోడ్ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లేలా చేస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ ఏ సినిమా చేస్తాడన్నది ఇంకా డిక్లేర్ కాలేదు. త్రివిక్రం, మోహన్ రాజా ఇలా ఇద్దరి ముగ్గురు దర్శకుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే చరణ్ మాత్రం తన నెక్స్ట్ సినిమా ఎవరితో అన్నది మాత్రం కన్ఫాం చేయలేదు. చరణ్ సినిమా ఎనౌన్స్ మెంట్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎలాగు పాన్ ఇండియా ఇమేజ్ వస్తుంది కాబట్టి ఆ క్రేజ్ కు తగినట్టుగా కథల కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే అది ఇంతవరకు ఆ కరెక్ట్ కథ దొరకలేదని తెలుస్తుంది. వంశీ పైడిపల్లి కూడా చరణ్ కోసం కథ చెప్పాడని వార్తలు వచ్చాయి. అయితే వంశీ కూడా చరణ్ ను మెచ్చే కథ చెప్పలేదని తెలుస్తుంది.