ఆరెక్స్ 100 సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు అజయ్ భూపతి. కార్తికేయ, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఇద్దరు కలిసి నటించిన ఆరెక్స్ 100 సినిమా ఇద్దరికి మంచి మైలేజ్ వచ్చేలా చేసింది. యువ హీరోల్లో తనదైన స్టైల్ లో దూసుకెళ్తున్నాడు కార్తికేయ. ఇక పాయల్ మాత్రం వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడేస్తుంది. అయితే ఆరెక్స్ 100 తర్వాత మహా సముద్రం కథతో చాలామంది హీరోల దగ్గరకు వెళ్లాడు అజయ్ భూపతి. ఆ టైం లో అతన్ని ఎందుకో నమ్మలేదు కొందరు హీరోలు.

ఫైనల్ గా శర్వానంద్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. మల్టీస్టారర్ గా వస్తున్న ఈ సినిమాలో బొమ్మరిల్లు సిద్ధార్థ్ కూడా నటిస్తున్నాడు. శర్వానంద్, సిద్ధార్థ్ అసలు ఊహలకే అందని ఈ కాంబో ఫిక్స్ చేసి సినిమా చేస్తున్నాడు అజయ్ భూపతి. ఈ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్, అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా ఉంటాయట. అజయ్ భూపతి మొదటి సినిమాలానే ఈ సినిమాతో కూడా తన సత్తా చాటుతాడని తెలుస్తుంది.

ముఖ్యంగా తనని కాదని చెప్పిన ప్రతి హీరోకి ఆన్సర్ ఇచ్చేలా మహా సముద్రం ఉండేలా చూస్తున్నాడు అజయ్ భూపతి. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని అంటున్నారు. శర్వానంద్ ప్రస్తుతం శ్రీరాం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మహా సముద్రం కూడా అంచనాలను అందుకునేలా ఉంటుందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: