ప్రస్తుతం ఒకదానివెంట మరొక సినిమా ఎంచుకుంటూ కొనసాగుతున్న బాహుబలి రెబల్ స్టార్ ప్రభాస్, ముందుగా రాధేశ్యామ్ సినిమా చేస్తున్నారు. అయితే ఆ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకోవడంతో ఆపై నాగ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, అలానే కెజిఎఫ్ దర్శకడు ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమాలు చేయనున్నారు ప్రభాస్.

కాగా అందుతున్న సమాచారాన్ని బట్టి కేవలం కొద్దిపాటి గ్యాప్ లోనే ప్రభాస్ ఈ మూడు సినిమాలు చేయనున్నట్లు టాక్. ఇప్పటికే ఆయా సినిమాల్లోని తన పాత్రల కోసం పూర్తిగా ఫిట్ గా తయారైన ప్రభాస్, ప్రస్తుతం ప్రత్యేకంగా ఒక ఫిజికల్ ట్రైనర్ ఆధ్వర్యంలో శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇటీవల వచ్చిన సలార్ సినిమా ప్రకటన తరువాత ప్రభాస్ ఫ్యాన్స్ లో ఆనందం విపరీతంగా పెరిగింది. కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో తమ హీరో ఒక సినిమా చేస్తే చూడాలన్న ప్రభాస్ ఫ్యాన్స్ కోరిక దీనితో తీరింది. హోంబలే ఫిలిమ్స్ వారు ఎంతో భారీగా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నట్లు టాక్.

ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా దర్శకడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ, ఈ సినిమాలో హీరో ఎంతో వైలెంట్ గా ఉంటాడని, అలానే ఆయనకు ధీటుగా విలన్ పాత్ర కూడా ఉంటుందని అన్నారు. మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగనున్న ఈ సినిమాలో హీరోగా ప్రభాస్ ని ఎంచుకోవడానికి మెయిన్ రీజన్, ప్రభాస్ బయట అమాయకమైన నెమ్మది మనస్తత్వం కలిగిన వ్యక్తి అని, అటువంటి వ్యక్తిని స్క్రీన్ పై పూర్తి వైలెంట్ గా చూపచాలనేది తన కోరిక అని, ముఖ్యంగా ఆయన బాడీ ఫిట్నెస్, అటువంటి క్యారెక్టర్స్ కి పక్కాగా సరిపోతుందని అన్నట్లు తెలుస్తోంది. అతి త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: