టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అతి త్వరలో మొదలు కానున్న తన నెక్స్ట్ మూవీ సర్కారు వారి పాట కోసం ఇప్పటికే సన్నద్ధం అవుతున్నారు. తొలిసారిగా గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తో మహేష్ చేయబోయే ఈ సినిమాపై ఆయన ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. తొలిసారిగా మహేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటించనున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి ప్రేక్షకులు అలానే అభిమానుల నుండి బాగా రెస్పాన్స్ వచ్చింది.
ఆ టీజర్ లో మహేష్ లాంగ్ హెయిర్ తో చెవికి పోగు పెట్టుకుని, అలానే మెడపై రూపాయి బిళ్ళ ట్యాటూ వేయించుకుని ఉండడం గమనించవచ్చు. మొత్తంగా ఆ టీజర్ సర్కారు వారి పాట సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది అనే చెప్పాలి. ఇక అతి త్వరలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగనున్నట్లు టాక్. ఆ తరువాత మూవీ యూనిట్ అమెరికా కి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయనున్నారు అంటూ కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు విస్తృతంగా ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే అది నిజమే అని పలువురు ప్రేక్షకులు నమ్ముతుండడంతో ఎట్టకేలకు సర్కారు వారి పాట యూనిట్ నుంచి దీనిపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. అసలు ఈ వార్త ఎలా మొదలైందో తెలియదని, ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా తమ సినిమాలో పవర్ స్టార్ నటించడం లేదని యూనిట్ పక్కాగా తేల్చేయడంతో ఒక్కసారిగా ఈ పుకార్లకు అడ్డుకట్ట పడ్డట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: