ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..సీనియర్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఎప్పట్నుంచో తన డ్రీం ప్రాజెక్ట్ "పొన్నియన్ సెల్వన్"చెయ్యాలని అనుకున్నాడు. అనుకున్నట్లుగానే ‘పొన్నియన్‌ సెల్వన్‌’ షూటింగ్ ఇటీవల ప్రారంభం అయ్యింది.ఇందులో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్‌, కార్తి, విక్రమ్, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాజేష్ లాంటి సూపర్‌ సీనియర్‌, సీనియర్‌, జూనియర్‌ స్టార్లు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రాబోతుంది.

చోళరాజుల కాలానికి సంబంధించిన కథ ఇదని మణిరత్నం చాలా రోజులుగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఆసక్తికరమైన అప్‌డేట్‌ వచ్చింది. సినిమా సెట్స్‌పై ఉండగానే.. అదిరిపోయే ఓటీటీ ఆఫర్‌ వచ్చిందట.ఇక తాజాగా అందుతున్న  సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాకి నెట్ ఫ్లిక్స్ నుంచి మంచి ఆఫర్ వచ్చిందట. నెట్‌ఫ్లిక్స్‌ ఈ సినిమా విషయంలో మణిరత్నంతో చర్చలు జరిపి సినిమా హక్కలు కోసం పెద్ద మొత్తం ఆఫర్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.‘పొన్నియన్‌ సెల్వన్‌’కు మణిరత్నం నిర్మాతగా కూడా బాధ్యత వహిస్తున్నాడు.

ఇలాంటి గొప్ప సినిమాను నెట్ ఫ్లిక్స్ డైరెక్ట్ డిజిటల్‌ స్టైల్‌లో విడుదల చేయాలని భావిస్తోందట. మరి ఈ డీల్‌కు మణిరత్నం ఓకే చెబుతారా లేదా అని ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ ఓకే అంటే పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే అవకాశం వుంది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: