ఈ మధ్యకాలంలో గీతా ఆర్ట్స్ వాళ్ళు ఎక్కువగా చిన్న సినిమాలు నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తక్కువ బడ్జెట్ లో అయిపోవడమే కాక ఆహా యాప్ కోసం వాడుకునేందుకు ఈ ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టే తాజాగా గీతా ఆర్ట్స్ సంస్థ ఒక చిన్న బడ్జెట్ సినిమా నిర్మించడానికి రెడీ అయిందని చెబుతున్నారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం డిస్కో రాజా లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు దర్శకుడు విఐ ఆనంద్. అయితే మొదటి రెండు సినిమాలు మంచి హిట్ అయినా రవితేజతో చేసిన డిస్కో రాజా సినిమా మాత్రం భారీ డిజాస్టర్ రిజల్ట్ తెచ్చిపెట్టింది. 

సినిమా తరువాత సైలెంట్ అయిపోయిన ఈ దర్శకుడు ఇప్పుడు ఒక ప్రయోగాత్మక కథతో గీతా ఆర్ట్స్ తలుపు తట్టినట్టు సమాచారం. దర్శకుడు వి.ఆనంద్ గతంలో ఒక క్షణం అనే సినిమాని గీతా ఆర్ట్స్ లోనే చేశాడు. అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఈయన బన్నీ కోసం ఒక కథ కూడా రెడీ చేశాడు. అయితే ఎందుకో కానీ ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఈయన ఒక చిన్న బడ్జెట్ కథ చెప్పడం అది గీతా ఆర్ట్స్ వాళ్ళకి నచ్చడంతో దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. 

ఈ సినిమాలో నలుగురు కమెడియన్లు హీరోలుగా కనిపిస్తారట. ఈ నలుగురి పాత్రలకు గాను రెండు పాత్రలు ఇప్పటికే ఇద్దరు కమేడియన్స్ దక్కించుకున్నారు. కమెడియన్ సత్య, అ;లానే కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఇద్దరూ రెండు పాత్రలకు ఎంపికయ్యారు. మరో రెండు పాత్రలకు సంబంధించి ఎంపిక ప్రక్రియ జరుగుతుందని సమాచారం. కామెడీ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: