తాజాగా డైరెక్టర్ గోపిచంద్ మలినేని, రవితేజ ల  కాంబోలో వచ్చిన 'క్రాక్ 'సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది..ఈ సినిమాతో వీరిద్దరి కాంబో హ్యాట్రిక్ హిట్ సాధించింది.. గతంలో వీరి కాంబినేషన్లో డాన్ శీను, బలుపు వంటి సూపర్ హిట్స్ వచ్చాయి... ఈ సినిమాతో మన అందాల రాసి శ్రుతిహాసన్ రీఎంట్రీ ఇచ్చింది.ఇక ఈ సినిమా కరోనా తర్వాత విడుదల మొట్టమొదటి భారీ బడ్జెట్ సినిమాతోనే కాకుండా మొట్టమొదటి బ్లాక్ బస్టర్‌గా కూడా పేరు తెచ్చుకుంది. ఈ ఏడాదిని మాస్ మహరాజ్ రవితేజ గొప్ప విజయంతో ప్రారంభించాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేనికి పరిశ్రమలో డిమాండ్ భారీగా పెరిగింది.

ఇప్పటి వరకు సరైన హిట్ లేని గోపీచంద్ ఈ సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు..ప్రస్తుతం ఈ దర్శకుడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు.. ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత తన సినిమాకి మంచి కలెక్షన్లు వచ్చాయి. తాను తీసిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ కి విపరీతంగా  నచ్చింది. యాక్షన్ సీన్లు, మేకింగ్ విషయంలో మంచి మార్క్ చూపాడు. రామ్ చరణ్ వంటి పెద్ద హీరో కూడా సినిమాని, తన వర్క్ ని మెచ్చుకుంటూ ట్వీట్ వెయ్యడంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నాడు.ఈ సినిమా మేకింగ్ టైంలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడట. కరోనా వల్ల సినిమా విడుదల అవుతుందా లేదా అని టెన్షన్ తో ఏడుపు వచ్చిందట.

 ఈ విషయాన్నీ సంగీత దర్శకుడు తమన్ బయటపెట్టాడు. ఇక రిలీజ్ తర్వాత కూడా ఏడ్చాడట. కానీ ఈ సారి అవి ఆనంద భాష్పాలు.ఇలా రవితేజకు మూడు హిట్లు ఇచ్చిన దర్శకుదిగా గోపీచంద్ మలినేని పేరు తెచ్చుకున్నాడు. ఐతే, 'క్రాక్' సంక్రాంతి పండగ తర్వాత ఎంత మేరకు నిలబడుతుంది. ఓవరాల్ దీని రేంజు ఏంటి అనేది చూడాలి. 'క్రాక్' ఆడకపోయి ఉంటే గోపీచంద్ మలినేని కెరీర్ కి ఇబ్బందే ఉండేది..మొత్తానికి కాస్త లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు గోపిచంద్ మలినేని...!!

మరింత సమాచారం తెలుసుకోండి: