తెలుగులో మాస్ మహారాజ రవితేజ హీరోగా శంభో శివ శింభో అనే చిత్రంతో దర్శకుడిగా తానెంటో నిరూపించుకున్నాడు తమిళ నటుడు సముద్ర ఖని...కేవలం డైరెక్టర్ గానే కాకుండా ఓ మంచి నటుడిగా కూడా పలు తమిళ, తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఇక టాలీవుడ్ లో గత ఏడాది 2020లో విడుదలైన అల వైకుంఠపురంలో చిత్రంతో తెలుగులో పూర్తి స్థాయి నటుడిగా కనిపించాడు ఈయన..ఆ సినిమాలో పూర్తి స్థాయి విలన్ పాత్రలో నటించి..తన మంచి నటనతో అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్న సముద్ర ఖని.. ఇటీవలే రవితేజ హీరోగా నటించిన క్రాక్ చిత్రంలో కటారి పాత్రలో అదరగొట్టాడు.

డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియాప్రాజెక్టులో ఆర్ఆర్ఆర్ లో నటించే అరుదైన ఛాన్స్ కొట్టేశాడు.అయితే ఈ సినిమాలో నటించే అవకాశం ఎలా వచ్చిందో చెప్పాడు సముద్రఖని. రాజమౌళి నాకు గత 11 ఏండ్లుగా మంచి స్నేహితుడు. నేను తెరకెక్కించిన శంభో శివ శంభో విడుదల తర్వాత రాజమౌళి నా పని తనాన్ని మెచ్చుకున్నాడు.ఆర్ఆర్ఆర్ లో నటించే అవకాశం రావడానికి కారణం 11 ఏండ్ల స్నేహమే అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి రానున్న కాలంలో సముద్రఖని తెలుగు ప్రేక్షకులను మరింత అలరించేందుకు సిద్దమవుతున్నాడన్నమాట..

మొత్తానికి రాజమౌళి చొరవతో సముద్ర ఖని..  RRR లాంటి పాన్ ఇండియా ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసాడన్నమాట..ఇక ప్రస్తుతం rrr మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది..ఇక ఈ సినిమా తాజా షెడ్యూల్ పూణే లో జరగనున్నట్లు సమాచారం.. దాదాపు ఓ వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందట..ఇప్పటికే ఈ సినిమా 90శాతం షూటింగ్ ని పూర్తి చేసుకున్నట్లు సమాచారం..ఇక మిగతా షూటింగ్ను వీలయినంత త్వరగా పూర్తి చేసి ఈ ఎడాది చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: