బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఇండియా నుంచి యూఎస్ కు అలాగే యూఎస్ నుంచి ఇండియాకు ట్రావెల్ చేస్తూ బిజీగా ఉంది. రీసెంట్ గా ఇండియాకు రిటర్న్ వచ్చింది. తన భర్త అలాగే ముగ్గురు పిల్లల్తో కలిసి ఇండియాలో అడుగుపెట్టింది. ఓ లీడింగ్ డైలీకి ఇంటర్వ్యూ ఇచ్చింది. ముంబైలో అడుగుపెట్టాలంటేనే వణుకు వచ్చేదని గుర్తుతెచ్చుకుంది. తనతో పాటు తన ఫ్యామిలీ సురక్షితంగా ఉందా అన్న విషయంపై తనకు అనుక్షణం టెన్షన్ వచ్చేదని గుర్తుచేసుకుంది. పాండెమిక్ వల్ల తన భర్త డేనియల్ తో పాటు తాను కూడా ఆందోళనకు గురయ్యానని తన బాధను వెళ్లగక్కింది.

ముంబైలో అడుగుపెట్టిన మొదట్లో చాలా టెన్షన్ కు గురైనట్టు గుర్తుచేసుకున్న ఈ భామ డిన్నర్ కోసం బయటికి అడుగుపెట్టడం కూడా స్ట్రెస్ ను కలిగించేదని చెప్పుకొచ్చింది.  ఆ తరువాత తాను నార్మల్ గా మారానని చెప్పుకొచ్చింది. ఇంటి నుంచి అడుగు బయట పెడితే చాలు ఫోటోగ్రాఫర్స్ తమ ఫోటోస్ కోసం ప్రయత్నిస్తారని, అటువంటి సమయంలో వారు మాస్క్ వేసుకున్నారా లేదా అన్న విషయంపై తాను ఫోకస్ పెడతానని చెప్పుకొచ్చింది. తన కుటుంబం సేఫ్టీకి సంబంధించి తన ఇంట్లో అడ్వాన్స్డ్ మెషిన్ ఉన్న విషయాన్ని తెలియచేసింది. ఆ మెషిన్ కేవలం ఎయిర్ ప్యూరిఫయర్ మాత్రమే కాదని అంతకు మించి తమకు సేఫ్టీని ఇస్తోందని చెప్పుకొచ్చింది.

సన్నీ ప్రస్తుతం తన వర్క్ షెడ్యూల్ కోసం ముంబైలో అడుగుపెట్టింది. పాండెమిక్ లో కూడా షూటింగ్స్ ను కంటిన్యూ చేస్తున్నారు నటీనటులు. ఆ కోవలోకే సన్నీ కూడా చేరింది. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి ఈ పాండమిక్ వల్ల పెద్ద దెబ్బే తగిలింది. మళ్ళీ ఇండస్ట్రీ కోలుకోవడానికి నటీనటులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ పాండెమిక్ లో కూడా తమకు వర్క్ దొరికిందన్న పాజిటివిటీతో ముందుకెళుతున్నారు. తన చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయని, మరో ఆరునెలల వరకు ఖాళీ లేదని చెప్పుకొచ్చింది ఈ భామ.

మరింత సమాచారం తెలుసుకోండి: