స్టేజీ మీద కూడా తనకు వచ్చిన డబ్బు నుంచి సేవా కార్యక్రమాలు చెప్పడతానని చెప్పాడు. దానికి స్పందించిన చిరంజీవి, నాగార్జున కూడా తమ తరఫున డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు ఆ మొత్తం డబ్బులో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు ఖర్చుపెడుతున్నారు. నగరంలోని నేరెడ్మెట్లో ఉన్న మదర్స్ నెస్ట్ వృద్ధాశ్రమం, రామగుండంలోని తబిత స్వచ్ఛంద సంస్థ, హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని పీపుల్స్ హెల్పింగ్ చిల్డ్రన్స్ సోషల్ ఆర్గనైజేషన్, విజయవాడలోని జామియా మహదుల్ అష్రాఫ్ వంటి సేవా సంస్థలతో పాటు మహ్మద్ మెయునుద్దీన్ కుటుంబానికి డబ్బులు అందజేయడం జరిగింది.
మొత్తం వీటన్నింటికి కలిపి సుమారు 10 నుంచి 15 లక్షల వరకు డబ్బులు సోహెల్ ఇచ్చి ఉంటాడని తెలుస్తోంది. మరోవైపు సోహెల్కు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. ‘జార్జిరెడ్డి’ నిర్మాత బ్యానర్లో ఓ సినిమా ప్రకటించారు. ఓ బాలీవుడ్ వెబ్ సిరీస్లోనూ చేస్తున్నట్లు సోహెల్ ఇటీవల ప్రకటించాడు. ఇది కాకుండా సీరియళ్లలోను ముఖ్యమైన పాత్రలు వస్తున్నాయట. ఇక సోహెల్ నిజం చెప్పాలంటే అందరికంటే బాగా లాభ పడ్డాడు. కాని తన స్వార్ధం చూసుకోకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకొని తన నిజాయితీని చాటుకున్నాడు సోహెల్. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి..