ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది అనసూయ.తన  అందం, హొయలు.. అప్పుడప్పుడు అదనపు స్కిన్‌ షోతో కుర్రకారును హీటెక్కిస్తూ మతులు పోగొట్టింది. అలా ఒకప్పుడు తనకు అవకాశాలు రాని వెండితెరపై అడుగుపెట్టేసింది. అలా అని ఇక్కడ కేవలం అందాల ప్రదర్శనకే పరిమితమవ్వలేదు. ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘యాత్ర’ లాంటి సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేసింది. ఎంతగానో ఆకట్టుకుంది.

తాజాగా అనసూయ క్రేజ్  ఇతర పరిశ్రమలకు కూడా విస్తరించింది. మొన్నటికిమొన్న తమిళ పరిశ్రమలో అడుగుపెట్టిన అను.. ఇప్పుడు మలయాళంలోకి కూడా వెళ్తోందట. తమిళంలో విజయ్‌సేతుపతితో ఓ సినిమా చేస్తోందని వార్తలు వస్తుండగా.. ఇప్పుడు మమ్ముట్టి సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిందనే వార్తలు మొదలయ్యాయి. వీటి విషయంలో అనసూయ స్పందించలేదు … అలా అని కొట్టి పారేయలేదు కూడా. అనసూయ తర్వాత  బాలీవుడ్‌  కి వెళ్తుంది అనే టాక్‌ కూడా వినిపిస్తోంది.ఇక అంతేకాకా కృష్ణవంశీ ‘రంగమార్తాండ’, రవితేజ ‘ఖిలాడీ’లోనూ అనసూయ ముఖ్యమైన పాత్రలు దక్కించుకుందట.


ఇప్పటికే  ఈ హాట్ బ్యూటీ  వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కించిన ‘యాత్ర’లో నటించడం జరిగింది. అందులో మమ్ముట్టితో ఆమె కలసి నటించింది రెండు సన్నివేశాలే. ఇప్పుడు చేయబోయే సినిమాలో ఆమెకు ప్రాధన్యమున్న పాత్రే దక్కినట్లు సమాచారం. ఇంకా ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: