‘సాలా ఖడూస్’, ‘తను వెడ్స్ మను’ వంటి హిట్ చిత్రాల్లో నటించాడు. ఇదిగో వీటిలో ‘తను వెడ్స్ మను’ సినిమాలో మాధవన్ సరసన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించింది. ఇప్పుడు ఈ సినిమాపైనే మరో నటి నీతూ చంద్ర సంచలన వ్యాఖ్యలు చేసింది. తను వెడ్స్ మను చిత్రంలో తాను హీరోయిన్ గా నటించాల్సిందని, కానీ కంగనా రనౌత్ కావాలని హీరో మాధవన్ అడగడంతో తనను తొలగించారని నీతూ చంద్ర షాకింగ్ విషయం వెల్లడించింది. తనను ఆ చిత్రం నుంచి తొలగించడానికి ఎటువంటి కారణమూ లేదని, కేవలం హీరో చెప్పాడనే డైరెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని వెల్లడించింది.
అంతే కాదు తనకు చాలా మంది నటుల్లా అంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ లేదని, ఈ కారణంగా చాలా సినిమా అవకాశాలు చెయ్యి జారాయని పేర్కొంది. ఎలా లేదనుకున్నా కనీసం ఆరు సినిమాల్లో అవకాశాలు తనకు ఇలానే పోయాయని చెప్పి ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇటీవలి కాలంలో బాలీవుడ్ లో నెపోటిజం, బంధు ప్రీతిపై పెద్ద గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఈ మంటలు పూర్తిగా చల్లారక ముందే నీతూ చంద్ర ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టిస్తోంది.