సినిమా ఇండస్ట్రీ ముఖ చిత్రాలుగా ఉండే హీరోల వల్ల చాలా మంది అమ్మాయిలు అవకాశాలు కోల్పోయినట్లు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ గొడవలో కూల్ హీరో మాధవన్ కూడా ఇరుక్కున్నాడు. ‘సఖి’, ‘చెలి’ వంటి రొమాంటిక్ సినిమాలతో తెలుగు నాట కూడా అభిమానులను సంపాదించుకున్న ఈ స్టార్ హీరో.. తమిళంతో పాటు ఈ మధ్య కాలంలో ఎక్కువగా హిందీ సినిమాల్లో నటిస్తున్నాడు. గతంలో రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో మాధవన్ నటించిన ‘త్రీ ఇడియట్స్’ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టింది. ఆ తర్వాత కూడా హిందీలో మాధవన్ కు మంచి చిత్రాలు లభించాయి.

 ‘సాలా ఖడూస్’, ‘తను వెడ్స్ మను’ వంటి హిట్ చిత్రాల్లో నటించాడు. ఇదిగో వీటిలో ‘తను వెడ్స్ మను’ సినిమాలో మాధవన్ సరసన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించింది. ఇప్పుడు ఈ సినిమాపైనే మరో నటి నీతూ చంద్ర సంచలన వ్యాఖ్యలు చేసింది. తను వెడ్స్ మను చిత్రంలో తాను హీరోయిన్ గా నటించాల్సిందని, కానీ కంగనా రనౌత్ కావాలని హీరో మాధవన్ అడగడంతో తనను తొలగించారని నీతూ చంద్ర షాకింగ్ విషయం వెల్లడించింది. తనను ఆ చిత్రం నుంచి తొలగించడానికి ఎటువంటి కారణమూ లేదని, కేవలం హీరో చెప్పాడనే డైరెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని వెల్లడించింది.

అంతే కాదు తనకు చాలా మంది నటుల్లా అంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ లేదని, ఈ కారణంగా చాలా సినిమా అవకాశాలు చెయ్యి జారాయని పేర్కొంది. ఎలా లేదనుకున్నా కనీసం ఆరు సినిమాల్లో అవకాశాలు తనకు ఇలానే పోయాయని చెప్పి ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇటీవలి కాలంలో బాలీవుడ్ లో నెపోటిజం, బంధు ప్రీతిపై పెద్ద గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఈ మంటలు పూర్తిగా చల్లారక ముందే నీతూ చంద్ర ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: