ఈ బోల్డ్ సినిమాను తీస్తున్నప్పుడు చాలా టాక్లు వినిపించినప్పటికీ.. హిట్ కొట్టి తానేంటో నిరూపించుకున్నారు.కాగా ఈ దర్శకనిర్మాత, స్టార్ హీరోయిన్ త్రిషపై కీలక వ్యాఖ్యలు చేశారు.శోభన్ దర్శకత్వంలో ప్రభాస్, త్రిష హీరోహీరోయిన్లుగా తెరకెక్కించిన వర్షం చిత్రం విడుదలై 17 సంవత్సరాలు అయ్యింది. 2004లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది. అంతేకాదు ప్రభాస్, త్రిషల కెరీర్లో గుర్తుండిపోయే చిత్రంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఎంఎస్ రాజు వర్షం సినిమాను గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేసిన రాజు.. రికార్డు బ్రేకింగ్ వర్షం సినిమా వచ్చి 17 సంవత్సరాలు అయ్యింది. ఈ సినిమా ప్రభాస్కి సూపర్ స్టార్డమ్ని..
త్రిషకు ఎంతోమంది అభిమానులను తీసుకొచ్చింది. స్క్రీన్ వెనకాలా మాకు ఎన్నో గుర్తుండిపోయే ఙ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని గుర్తు చేసుకుంటున్నప్పుడు తెలియని ఆనందం ఉంటుంది అని కామెంట్ పెట్టారు.ఇక ఆ ట్వీట్కి త్రిష.. ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యు సర్ అని కామెంట్ పెట్టింది. దానికి స్పందించిన ఎంఎస్ రాజు.. నువ్వు నాకు ఎప్పటికీ ఇష్టమైన హీరోయిన్వి. మా సినిమాల కోసం నువ్వు నీ బెస్ట్ని ఇచ్చినందుకు థ్యాంక్యు అని కామెంట్ పెట్టారు..ప్రస్తుతం వీరిమధ్య జరిగిన సంభాషణలు ట్వీట్స్ రూపంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి...!!