ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం "రాధే శ్యామ్" సినిమా చేస్తున్నాడు.రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల తెరకెక్కుతున్న  ‘రాధే శ్యామ్’ మూవీలో ప్రభాస్ దొంగగా కనిపించబోతున్నాడని టాక్ నడుస్తుంది. 1960 దశకం నాటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పాటు పునర్జన్మల నేపథ్యంలో ఈ మూవీ కథ మునుపెన్నడూ చూడని విధంగా తెరకెక్కుతుందని సమాచారం అందుతుంది. ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో విడుదల కాబోతుంది. మూవీ టీజర్ త్వరలోనే వస్తుందని చిత్ర బృందం ఇటీవల ప్రకటించడంతో రెబల్ స్టార్  ఫ్యాన్స్ ఆసక్తిగా  ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ  అంచనాలున్నాయి.జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం చివరిదశ షూటింగ్‌కి చేరుకుంది. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

తాజాగా ఈ చిత్ర బృందం అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ హీరో ప్రభాస్ స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చారు.యూనిట్ మొత్తానికి ప్రభాస్ రిస్ట్ వాచ్‌లు గిఫ్టులుగా ఇచ్చాడట. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తన సినిమాలో పని చేస్తున్న టెక్నీషియన్లందరికీ ఖరీదైన వాచ్‌లను పంపించాడని సమాచారం. దీంతో ప్రభాస్‌ మనసు నిజంగా చాలా పెద్దది అని ఆయనిచ్చిన గిఫ్ట్‌ చూసి యూనిట్‌ సభ్యులు మురిసిపోతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఈ న్యూస్ తెలిసి హర్షం  వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: