అల వైకుంఠపురములో సినిమా సూపర్ హిట్ అందుకోవడంతో త్రివిక్రం మరోసారి తన స్టామినా ఏంటన్నది చూపించగలిగారు. కథ లైటర్ వేలో చెప్పినా కథనం.. మాటలు ఇవి రెండే త్రివిక్రం సినిమాల్లో బాగా ఉంటాయి. అల వైకుంఠపురములో తర్వాత వన్ ఇయర్ గ్యాప్ తీసుకున్న త్రివిక్రం ఎన్.టి.ఆర్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నారు. ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తుందని టాక్.

ఎన్.టి.ఆర్ సినిమాను త్వరలో మొదలు పెట్టి 2022 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో త్రివిక్రం తన నెక్స్ట్ సినిమా రాం చరణ్ తో మొదలు పెడతాడని తెలుస్తుంది. చరణ్ తో త్రివిక్రం కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్న సినిమా ఈ ఏడాది సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు. ఎన్.టి.ఆర్ కోసం అనుకున్న పాన్ ఇండియా సబ్జెక్ట్ తోనే చరణ్ తో త్రివిక్రం చేస్తాడని తెలుస్తుంది.

ప్రస్తుతం ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు ఆర్.ఆర్.ఆర్ తో బిజీగా ఉన్నారు. ఆ సినిమాకు తమ పోర్షన్ కంప్లీట్ చేసి ఇక వారి సినిమాల మీద ఫోకస్ పెట్టనున్నారు. రాం చరణ్ ట్రిపుల్ ఆర్ తో పాటుగా ఆచార్య సినిమాకు పనిచేస్తున్నాడు. ముందు పావుగంట మాత్రమే అనుకున్న పాత్రని 1 అవర్ చేసినట్టు టాక్. ఆచార్యలో చరణ్ పాత్ర హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తుంది. తప్పకుండా రాం చరణ్ మెగా ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తాడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: