చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆయన తదుపరి సినిమాని లైన్ లో పెట్టే పనిలో ఉన్నాడని అంటున్నారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా పూర్తయిన వెంటనే లూసిఫర్ రీమేక్ ని ఈయన సెట్స్ మీదకు తీసుకు వెళ్తాడని అంటున్నారు. నిజానికి ముందు వేదాళం రీమేక్ ని తెరకెక్కించాలని భావించారు. కానీ ఎందుకో మరలా మనసు మార్చుకున్న చిరంజీవి దానికంటే ముందుగానే లూసిఫర్ రీమేక్ చేస్తున్నారట. 

మెగా కాంపౌండ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా జనవరి 21వ తారీఖున పూజా కార్యక్రమాలతో మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే ఈ సినిమా సంక్రాంతి తరువాత షూటింగ్ మొదలు పెడతామని పేర్కొన్నారు. అయితే అన్నీ అనుకున్నట్లుగానే జరుగుతూ ఉండటంతో మరో వారంలో ఈ సినిమాను మొదలు పెట్టనున్నారని చెబుతున్నారు. ఇక తెలుగులో హనుమాన్ జంక్షన్, తమిళంలో తనీ ఒరువన్ లాంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాని తెరకెక్కించనున్నారు.

అయితే పూజా కార్యక్రమాలతో 21న ఈ సినిమాని లాంచ్ చేసినా సరే రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఫిబ్రవరి నుంచి మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి చాలా ప్రచారాలు ముందు నుంచి జరుగుతూ వస్తున్నాయి. ఒరిజినల్ వెర్షన్ లో లో హీరో చెల్లెలి పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. అందుకే ఈ పాత్ర కోసం ఒక లీడింగ్ హీరోయిన్ తీసుకోవాలని ముందు నుంచి మేకర్స్ భావిస్తున్నారు. అయితే చిరంజీవికి చెల్లెలుగా ఎవరు నటిస్తారు అనేది సస్పెన్స్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: