మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత సినిమాల దూకుడు పెంచారని చెప్పొచ్చు. ఖైదీ నంబర్ 150, సైరా తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్నాడు చిరంజీవి. ఈ సినిమాలో రాం చరణ్ కూడా నటిస్తున్నాడు. మ్యాట్నీ మూవీస్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డిమూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మళయాళ హిట్ మూవీ లూసిఫర్ ను రీమేక్ చేస్తున్నారు చిరు. కోలీవుడ్ డైరక్టర్ మోహన్ రాజా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది.

ఆచార్య ఆల్రెడీ 70 శాతం షూటింగ్ పూర్తి కాగా సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా త్వరలోనే లూసిఫర్ రీమేక్ కూడా సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తుంది. చిరు ఆ రీమేక్ సినిమాను కూడా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. సినిమాలో చిరుతో పాటుగా మరో యువ హీరో కూడా నటించాల్సి ఉంది.

ఈ ఇయర్ రెండు సినిమాలు రిలీజ్ చేయాలని మెగాస్టార్ ప్లాన్ అదిరింది. మెగా ఫ్యాన్స్ ను అలరించేలా మెగాస్టార్ రాబోయే సినిమాలతో పర్ఫెక్ట్ స్కెచ్ వేశాడు. సినిమాల కథలు ఎలా ఉన్నా తనకున్న మెగా మాస్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయని తెలుస్తుంది. లూసిఫర్ రీమేక్ తర్వాత వేదాళం రీమేక్ చేయబోతున్న చిరు. మెహెర్ రమేష్ డైరక్షన్ లో తమిళ రీమేక్ చేస్తున్న చిరు.

మరింత సమాచారం తెలుసుకోండి: