ఒకప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్ ను ఏలిన బాద్షా షారుఖ్ ఖాన్ ఇప్పుడు కెరియర్ లో వెనకపడ్డాడు. 2018లో వచ్చిన జీతో సినిమా కూడా షాక్ ఇవ్వడంతో సినిమాలను పక్కన పెట్టి ఎంచక్కా వాణిజ్య ప్రకటలను చేస్తూ వస్తున్నాడు. సినిమాలు ఫ్లాప్ అవుతున్నా సరే షారుఖ్ ఖాన్ క్రేజ్ తగ్గట్లేదు. అయితే ఒకటి రెండు కథలు తన దగ్గరకు వచ్చినా చేయని షారుఖ్ సౌత్ డైరక్టర్ అట్లీ మీద గురి పెట్టుకున్నాడు.

దళపతి విజయ్ తో వరుస హిట్లు అందుకున్న అట్లీ తన నెక్స్ట్ సినిమా షారుఖ్ ఖాన్ తో చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాతో షారుఖ్ ఖాన్ కూడా తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నాడు. అయితే కేవలం బాలీవుడ్ లోనే కాకుండా షారుఖ్ తో అట్లీ చేసే సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారట. సౌత్ మీద కన్నేసిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.

కేవలం హిందీ మార్కెట్ మీదనే తన లక్ టెస్ట్ చేసుకోకుండా ఈసారి సినిమాను పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నారట. ఆల్రెడీ అట్లీ కథ వినిపించడం  సినిమా కన్ ఫాం అవడం జరిగింది. ఇక అఫీషియల్ గా చేయాల్సి ఉన్న ఈ సినిమా అంచనాలకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. కేవలం హిందీ, తెలుగు, తమిళమే కాదు కన్నడ, మళయాళంలో కూడా ఈ సినిమా వస్తుందని టాక్. షారుఖ్ హిట్టు సినిమా కోసం అతని ఫ్యాన్స్ చాలా ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: