ఈ ఏడాది సమ్మర్ ని హీటెక్కించే మూవీస్ లిస్ట్ లో ఫస్ట్ ఉండేది మాత్రం కచ్చితంగా మెగా స్టార్ చిరంజీవి ఆచార్య. ఈ మూవీ షూటింగ్ ఇపుడు శరవేగంగా జరుపుకుంటోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మరో రెండు నెలలలో కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని పూర్తి చేసుకుని మే లో రిలీజ్ చేస్తారని తాజా టాక్.

ఈ మూవీకి సంబంధించి ఇంటెరెస్టింగ్ అప్ డేట్స్ ఒక్కోటిగా బయటకు వస్తున్నాయి. ఈ మూవీ కేవలం చిరంజీవిదే అనుకుంటే పొరపాటే అంటున్నారు. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఉన్నాడు. అయితే ఇప్పటిదాకా రాం చరణ్ ది గెస్ట్ రోల్ అనుకున్నారు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు చూస్తే ఈ మూవీ లో రాం చరణ్ ఫుల్ లెగ్త్ రోల్ లో కనిపిస్తాడని అంటున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు కూడా కొన్ని కీలకమైన సన్నివేశాల్లో కనిపిస్తాడని కూడా చెబుతున్నారు.

ఇక రాం చరణ్ రోల్ ని ఈ మధ్య కాలంలో వచ్చిన ఆలోచనల మేరకు ఫ్యాన్స్ ఉంచి ఉన్న అంచనాల మేరకు పెంచినట్లుగా చిత్ర యూనిట్ నుంచి అందుతున్న సమాచారం. అదే కనుక జరిగితే మాత్రం ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అని ముందే రాసేసుకోవచ్చు అని అంటున్నారు. ఇక తండ్రీ కొడుకులు ఇద్దరూ గతంలో కొన్ని సినిమాల్లో అలా మెరిసారు అంతే. కానీ ఈ సినిమాలో మాత్రం ఇద్దరూ కలసి చాలా సేపు  స్క్రీన్ ని షేర్ చేసుకోబోతున్నారు.

అంటే ఒక విధంగా ఇది మల్టీ స్టారర్ మూవీ అని కూడా అంటున్నారు. ఇక ఈ మూవీ గురించి మరో అప్ డేట్ కూడా చక్కర్లు కొడుతోంది. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తారని. అదే కనుక జరిగితే మెగా ఫ్యాన్స్ హుషార్ ని ఆపడం ఎవరి తరం కూడా కాదు అని చెప్పాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: