తెలుగు చిత్ర పరిశ్రమకు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ 1 నేనొక్కడినే ‘ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కృతిసనన్. ఆతర్వాత తెలుగులో నాగచైతన్య నటించిన దోచేయ్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రేక్షకులను అలరించలేక పోయింది.  ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ బాలీవుడ్ కు తిరిగి చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ అయిపోయింది. కాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఇక ఈ భామ ప్ర‌స్తుతం అక్ష‌య్ కుమార్ తో క‌లిసి బ‌చ్చ‌న్ పాండే చిత్రంలో న‌టిస్తోంది. తన సినిమా అప్డేట్స్ తో పాటు హాట్ హాట్ ఫోటోలను , వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది కృతిసనన్. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ అప్ప‌డ‌పుడు హర్ట్ ట‌చింగ్ క‌విత్వాల‌తో అంద‌రినీ కొత్త ప్ర‌పంచ‌లోకి తీసుకెళ్తుంటుంది. తాజాగా కృతిస‌నన్ పెట్టిన క‌విత్వానికి అంద‌రూ ఫిదా అవుతున్నారు. గార్జియ‌స్ లుక్‌లో త‌న కండ్ల‌ను హైలెట్ చేస్తూ ఉన్న ఓ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన కృతిస‌నన్‌. 

'ఆమె కండ్లు లోతైన‌వి, నిజాయితీతో కూడుకున్న‌వి..

అవి ఎప్పుడూ మార‌వు..

అలాంటి ప్రేమ కోసం ఆమె వేచి చూస్తోంది..'

అంటూ కృతిస‌న‌న్ పెట్టిన క‌విత్వానికి నెటిజ‌న్లు ఫిదా అయిపోతున్నారు. ఆ కండ్ల గురించి మీరు చాలా బాగా రాశారు. నేనెప్పుడూ మీ క‌విత్వానికి అభిమానిని అని ఓ నెటిజ‌న్ కామెంట్ పెట్టాడు. ద‌య‌చేసి..ఇంకా ఇంకా రాయు.. ల‌వ్ యూ అంటూ మ‌రో వ్య‌క్తి కామెంట్ పోస్ట్ చేశాడు. క్యూటీ అంటూ మ‌రొక‌రు..ప‌దాలు ఇన్ షా అల్లా అంటూ మ‌రొక‌రు కామెంట్ల మీద కామెంట్లు పెట్టారు. కృతి స‌న‌న్ తాజా క‌విత్వం ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: