పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఒకప్పుడు ఏడాది టైం పట్టేది. తాపీగా షూటింగ్ చేసుకుని రిలీజ్ చేసేవారు.  రీ ఎంట్రీ తరువాత పవన్ జోరు ఒక్కసారిగా పెంచేశారు. దాంతో పాటు చేతిలో అరడజన్ మూవీస్ కూడా పవన్ కి ఉన్నాయి. వీటిని కేవలం రెండేళ్ళ వ్యవధిలో పూర్తి చేయడానికి పవన్ కమిట్ అయ్యారు.

ఇదిలా ఉంటే పవన్ మళయాళం రీమేక్ అయ్యప్పనుం కోషియం తెలుగులో చేస్తున్న సంగతి విధితమే. ఈ మూవీ కొత్త ఏడాది నుంచే సెట్స్ మీదకు రావాలి. కానీ అది  ఇంకా రాలేదు. దానికి కారణం ఏంటి అంటే  ఏ మేరకు నిజమో కానీ హీరోయిన్ సాయి పల్లవి అని ప్రచారం అయితే బయటకు వస్తోంది. ఈ మూవీలో పవన్ కి జోడీగా సాయి పల్లవి నటిస్తోంది.

అలాగే మరో హీరో రానాకు జోడీగా ఐశ్వర్య రాజేష్ ని తీసుకున్నారు. ఇక కీలకమైన పాత్రలో మిగిలిన వారిని సెలెక్ట్ చేశారు. ఇక షూటింగ్ వెళ్లడమే తరువాయి అనుకుంటే హీరోయిన్ సాయి పల్లవి డేట్స్ తో ప్రాబ్లం వచ్చిందట. ఆమె వేరే సినిమాల షూటింగులతో బిజీగా ఉండడంతో ఈ మూవీకి ఇపుడు డేట్స్ ఇవ్వలేకపోతోందిట. దాంతో ఆమె కోసం వెయిట్ చేయక తప్పదా అన్న సీన్ అయితే ఈ మూవీ విషయంలో కనిపిస్తోంది అంటున్నారు.

మరో వైపు ఈ మూవీకి స్క్రీన్ ప్లే, మాటలు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్  అందిస్తున్నారు. దాంతో ఈ మూవీకి సరికొత్త క్రేజ్ వచ్చింది. ఇక శరవేగంగా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేయాలని పవన్ తపన పడుతున్నారు అంటున్నారు. మొత్తానికి సాయి పల్లవి డేట్స్ అడ్జస్ట్ చేసుకుని సెట్స్ మీదకు వస్తే కానీ ఈ మూవీ స్టార్ట్ అవదా అన్న చర్చ అయితే సాగుతోందిట.  ఏది ఏమైనా ఈ మూవీ మీద అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: