సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ గా ఎదగడానికి తొలి మెట్టు వేసిన బ్లాక్ బస్టర్ సినిమా " ఒక్కడు ". అందుకే మహేష్ బాబు కెరియర్ లో ‘ఒక్కడు’ చిత్రానికి ఉన్న స్థానం ఎంతో ప్రత్యేకమైంది. "ఒక్కడు " సినిమాకు ముందు చాక్లెట్ బాయ్ లుక్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ ఉన్నప్పటికి మాస్ ఆడియన్స్ లో అంతగా క్రేజ్ లేదు. అలాంటి సమయంలో వచ్చిన ఒక్కడు సినిమా మహేష్ ను మాస్ ఆడియన్స్ కు విపరీతంగా దగ్గర చేసింది. 2003 జనవరి 15 తేదీన సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఈ చిత్రం అప్పుడు పోటీలో వున్న అన్నీ చిత్రాలను దాటుకొని ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాకి ఇప్పటికీ కూడా కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలై శుక్రవారం (జనవరి15) నాటికి 18 ఏళ్లు పూర్తయ్యాయి.

 ఈ సందర్భంగా నెట్టింట్లో ‘ఒక్కడు’ పోస్టర్లు హల్చల్‌ చేస్తున్నాయి. మహేష్ అభిమానులు ఒక్కడు హ్యాస్ ట్యాగ్స్ తో ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహేష్‌ సతీమణి నమ్రత చేసిన పోస్ట్‌ ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఒక్కడు సినిమా పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన నమ్రత.. ‘మహేష్ సినిమాల్లో ఒక్కడు ఒక క్లాసిక్‌ సినిమా. ఇది మళ్లీ మళ్లీ చూడలనిపించే సినిమా.. ఒక్కడు నాకు ఆల్‌ టైమ్‌ ఫేవరేట్‌ సినిమా. కాలంతో పాటు ఈ సినిమా వన్నె ఇంకా పెరుగుతూనే ఉంది’ అంటూ క్యాప్షన్‌ జోడించింది.

 ఈ పోస్టులో.. చిత్ర యూనిట్‌ సభ్యులైన.. మహేష్, భూమిక, గుణశేఖర్, ప్రకాష్ రాజ్, ఫైట్ మాస్టర్ విజయన్, మణిశర్మ ఇలా అందరి పేర్లను ప్రస్తావించింది నమ్రత. అయితే వీరిలో ఈ నిర్మాత ఎమ్‌ఎస్‌ రాజును మాత్రం మర్చిపోయింది. ఈ విషయాన్ని గమనించిన ఎమ్‌ఎస్‌ రాజు ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘పొరపాట్లు జరుగుతుంటాయి బాబు. నమ్రతగారు "ఒక్కడు" గురించి మాట్లాడుతూ నా పేరును మర్చిపోయారు. అయినా నాకు సంతోషమే. ఈ సినిమా ఆమెకు ఫెవరెట్ మూవీ. గుడ్ లక్ " అంటూ ట్వీట్ పెట్టి మహేష్ బాబును ట్యాగ్ చేశారు. మరి నమ్రత ఎం‌ఎస్ రాజు ట్వీట్ పై ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: