ఈ సందర్భంగా నెట్టింట్లో ‘ఒక్కడు’ పోస్టర్లు హల్చల్ చేస్తున్నాయి. మహేష్ అభిమానులు ఒక్కడు హ్యాస్ ట్యాగ్స్ తో ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహేష్ సతీమణి నమ్రత చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఒక్కడు సినిమా పోస్టర్ను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన నమ్రత.. ‘మహేష్ సినిమాల్లో ఒక్కడు ఒక క్లాసిక్ సినిమా. ఇది మళ్లీ మళ్లీ చూడలనిపించే సినిమా.. ఒక్కడు నాకు ఆల్ టైమ్ ఫేవరేట్ సినిమా. కాలంతో పాటు ఈ సినిమా వన్నె ఇంకా పెరుగుతూనే ఉంది’ అంటూ క్యాప్షన్ జోడించింది.
ఈ పోస్టులో.. చిత్ర యూనిట్ సభ్యులైన.. మహేష్, భూమిక, గుణశేఖర్, ప్రకాష్ రాజ్, ఫైట్ మాస్టర్ విజయన్, మణిశర్మ ఇలా అందరి పేర్లను ప్రస్తావించింది నమ్రత. అయితే వీరిలో ఈ నిర్మాత ఎమ్ఎస్ రాజును మాత్రం మర్చిపోయింది. ఈ విషయాన్ని గమనించిన ఎమ్ఎస్ రాజు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘పొరపాట్లు జరుగుతుంటాయి బాబు. నమ్రతగారు "ఒక్కడు" గురించి మాట్లాడుతూ నా పేరును మర్చిపోయారు. అయినా నాకు సంతోషమే. ఈ సినిమా ఆమెకు ఫెవరెట్ మూవీ. గుడ్ లక్ " అంటూ ట్వీట్ పెట్టి మహేష్ బాబును ట్యాగ్ చేశారు. మరి నమ్రత ఎంఎస్ రాజు ట్వీట్ పై ఎలా స్పందిస్తుందో చూడాలి.