మూడేళ్ల పాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాదిలో వరుస సినిమాలకు ఓకే చెప్పి.. వాటిని తెరకెక్కించే పనిలో పడ్డారు. రీసెంట్ గా ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ మరో సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ ను అందుకున్న అయ్యప్పనుమ్ కోషియం సినిమాను తెలుగు రీమేక్ చేయడానికి పవన్ ఏర్పాటు చేస్తున్నాడు. కాగా ఈ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి కలిసి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.
ఈ  సినిమా సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ రీమేక్ సినిమా కోసం గత కొంత కాలంగా స్క్రిప్టు పనుల్లో సాగర్ చంద్ర, త్రివిక్రమ్ యూనిట్ అంతా బిజీగా ఉంది. కాగా ఈ సినిమా షూటింగ్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. మల్టీస్టారర్ గా రాబోతున్న ఈ రీమేక్ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే  ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందిస్తున్నాడని ఈ చిత్ర యూనిట్ తెలిపింది.

మొత్తంగా ఈ మూవీకి మాటల మాంత్రికుడే ప్రాజెక్ట్  ఔట్ పుట్ పరిశీలకుడిగా ఉన్నాడని అర్థమవుతోంది. ఈ విషయాలన్నీ తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో ఈ వివరాలను అధికారికంగా వెళ్లడించారు.  మల్టీస్టారర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా మంచి సక్సెస్ సాదించడం కోసం ఈ చిత్ర యూనిట్ తెగ కష్టపడుతోంది. ఈ రీమేక్ సినిమాలో పవన్ సరసన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. కాగా పవన్  కళ్యాణ్, రానా దగ్గుపాటి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ఈ ఇద్దరి అభిమానులకు భారీ అంచనాలే ఏర్పడ్డాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: