దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతూ మనకు రక్షణలా ఉంటుంది ఆర్మీ. కన్నవారికి, కట్టుకున్న వారికి దూరంగా ఉంటూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ దేశానికి రక్షణ కవచంలా నిలబడుతున్నారు జవాన్లు.. వారి  కృషికి,సాహసానికి, ధైర్యానికి మనం వెల కట్టలేం. అలాంటి సైనికుల మూలంగానే ఈ నాడు మనం ఇంత సుఖ సంతోషాలతో ఉండగలుతున్నాము. అలాంటి వారెప్పుడు దేవుడితో సమానం. అందుకే  దేశం కోసం ప్రాణాల్పించే సైనికులు, మనకు మూడుపూటలా అన్నం నోటికి అందించే అన్నదాతలు ఎప్పుడు గొప్పవారుగానే పరిగణించబడుతున్నారు.
అలాంటి వారికి టాలీవుడ్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రిన్స్ మహేశ్ బాబు సెల్యూట్ చేసి.. వారి పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. నిన్న ఇండియన్ ఆర్మీడే సందర్భంగా నెటిజన్స్ అంతా సోషల్ మీడియా వేధికగా జవాన్ లకు గౌరవ వందనాలు చేసి వారి సేవ పట్ల ఆనందం వ్యక్తం చేశారు. దీనితో పాటుగా దేశం పట్ల వారు చూపుతున్న బాధ్యతను, వారు పడుతున్న కష్టాలను.. జవాన్లు చేస్తున్న సేవను గురించి మాట్లాడుకున్నారు. కాగా ఆర్మీ డే సందర్భంగా పరువురు సినీ స్టార్స్ కూడా జవాన్ల కష్టాన్ని గురించి చర్చించి.. వారి గొప్పతనాన్ని ప్రశంసల రూపంలో తెలియజేశారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ ఆర్మీ డే సందర్బంగా ఒక వీడియో మెసేజ్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘ జవాన్లకు తిండి దొరక్కపోయినా.. కంటి నిండ నిద్ర లేకపోయినా.. కాని దేశం కోసం పోరాడుతూనే ఉంటారు.

అందులోనూ ఎంతో ప్రేమించిన కుటుంబాల దగ్గరకు వెళ్తామో లేదో అనే స్థితిలోనే జవాన్ సంవత్సరం పొడుగునా మనం మన కుటుంబం సంతోషంగా ఉండటం కోసమే వాళ్ల కుటుంబానికి దూరంగా ఉంటూ దేశ రక్షణ కోసం పహారా కాస్తున్నారు. అందుకే మన సైనికులకోసం మనమందరం కలిసి  సెల్యూట్ చేద్దాం అంటూ ఒక వీడియోను మెసేజ్ చేశారు ఎన్టీఆర్. అలాగే ప్రిన్స్ మహేశ్ బాబు కూడా‘యూనిఫార్మ్ లో ఉన్న మన హీరోలెప్పుడు నిస్వార్థంగా సేవ చేస్తూనే ఉంటారని’ తన ట్విట్టర్ వేధికగా తెలిపారు. వారి త్యాగానికి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతలు చెప్పాల్సిందేనంటూ చెప్పాడు ప్రిన్స్ మహేశ్ బాబు.


మరింత సమాచారం తెలుసుకోండి: