తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి బాహుబలి సినిమాతో తన ప్రతిభ చాటుకున్నాడు. బాహుబలి ముందు వరకు టాలీవుడ్ లోనే స్టార్ డైరక్టర్ అయిన రాజమౌళి బాహుబలి మొదటి రెండు పార్టుల తర్వాత నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అదే క్రేజ్ తో ప్రస్తుతం ఎన్.టి.ఆర్, రాం చరణ్ లతో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు రాజమౌళి. ఈ సినిమాని కూడా భారీ అంచనాలతో తెరకెక్కిస్తున్నాడు.

సౌత్ ఇండస్ట్రీలో ఇన్నాళ్లు శంకర్ మాత్రమే నెంబర్ 1 రేసులో ఉన్నాడని అనుకోగా బాహుబలితో ఆ స్థానం తనది అనిపించుకున్నాడు రాజమౌళి. రాజమౌళి తర్వాత ప్రశాంత్ నీల్ కూడా సత్తా చాటుతున్నాడు. కె.జి.ఎఫ్ ముందు వరకు ఎవరికి తెలియని ఆయన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. కె.జి.ఎఫ్ సినిమాతో సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అందరికి హాట్ ఫేవరేట్ అయ్యాడు ప్రశాంత్ నీల్. ఈమధ్యనే వచ్చిన కె.జి.ఎఫ్ 2 సినిమా టీజర్ తో మరోసారి సినిమాపై అంచనాలు పెంచాడు.

అయితే రాజమౌళి, ప్రశాంత్ నీల్ ఇద్దరిలో ఒక కామన్ పాయింట్ ప్రేక్షకులను అలరిస్తుంది. వారెంత భారీ బడ్జెట్ సినిమా.. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చేసినా ప్రేక్షకుల మనసులను టచ్ చేసే సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్ పక్కాగా ఉండేలా చేస్తాడు. రాజమౌళి ఛత్రపతి సినిమాలో సూరీడు.. సూరీడూ అంటూ ఓ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. ప్రశాంత్ నీల్ కూడా కె.జి.ఎఫ్ లో మదర్ సెంటిమెంట్ హైలెట్ చేశాడు. కె.జి.ఎఫ్ 2లో కూడా అమ్మకిచ్చిన మాట కోసం అంటూ టీజర్ లో చూపించాడు. మొత్తానికి ఈ కనెక్షన్ రాజమౌళి, ప్రశాంత్ నీల్ లకు కామన్ గా ఉన్నా ఎవరి స్టైల్ లో వారు సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నారని చెప్పొచ్చు.                 

మరింత సమాచారం తెలుసుకోండి: