ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... లాక్ డౌన్ తరువాత సినిమా థియేటర్లు తెరుచుకోవడంతో దర్శకనిర్మాతలు తమ సినిమాలను విడుదల చేస్తున్నారు. సోలోగా వచ్చిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా విజయవంతం అవ్వడంతో మిగిలిన ఫిల్మ్ మేకర్స్ కి  నమ్మకం పెరిగి వరుసగా సినిమాలను విడుదల చేస్తున్నారు. టాలీవుడ్ కి సంక్రాంతి సీజన్ ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ఈ సంక్రాంతికి ఏకంగా నాలుగు సినిమాలు థియేటర్లో సందడి చేస్తున్నాయి. ‘క్రాక్’, ‘మాస్టర్’, ‘రెడ్’, అల్లుడు అదుర్స్’ సినిమాలు ప్రేక్షకుల విడుదల అవ్వగా .. వీటిలో ‘క్రాక్’ సినిమా వసూళ్ల  పరంగా దూసుకుపోతుంది.

అయితే ఓవర్ సీస్ లో  మాత్రం ఏ సినిమాకి కూడా చెప్పుకోదగ్గ వసూళ్లు రాలేదు. ప్రీమియర్ షోలు, మామూలు షోలలో వసూళ్లు ఏమి రావట్లేదట. ఒకప్పుడు పెద్ద సినిమా, మీడియం రేంజ్ సినిమా ఏదైనా.. మొదటి మూడు రోజుల్లోనే మిలియన్ డాలర్లు వసూళ్లు చేసేవి. కానీ ఇప్పుడు లక్ష డాలర్లు కూడా వసూలు చేయడానికి అల్లాడిపోతున్నాయట. ‘క్రాక్’ సినిమా విడుదలైన ఐదు రోజులైనా ఇప్పటివరకు లక్ష డాలర్ల మార్క్ అందుకోలేదని సమాచారం.

విజయ్ లాంటి సాలిడ్ ఫ్యాన్ బేస్డ్  స్టార్ హీరో సినిమాకి అతి తక్కువ ఓపెనింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. రామ్ నటించిన ‘రెడ్’, బెల్లంకొండ ‘అల్లుడు అదుర్స్’ సినిమాల పరిస్థితి చెప్పుకోనక్కర్లేదు. ఈ సినిమాల కలెక్షన్స్ ని బట్టి అమెరికా మార్కెట్ అసలు  ఓపెన్ కాలేదని సమాచారం అందుతుంది.ఇక ముందు ముందు రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: