పవర్ స్టార్ పవన్కళ్యాణ్ మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుం కోషియం సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ సినిమా కోసం దర్శకుడు త్రివిక్రమ్ స్టోరీ అలాగే మాటలు అందిస్తున్నారని కూడా ఈ సినిమా యూనిట్ ను అధికారికంగా ప్రకటించింది. అంతేకాక ఈ సినిమా షూటింగ్ కూడా మరో వారంలో మొదలు అవుతుంది అంటూ ఏకంగా షూటింగ్ డేట్ కూడా ప్రకటించేశారు. ఆ ప్రకటన మేరకు 22 జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. 


తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్ అధికభాగం కేరళలోని పొల్లాచ్చిలో అలాగే తమిళనాడు అడవుల్లో జరిగేందుకు అవకాశం ఉందని అంటున్నారు. ఈ షూటింగ్ కోసం వచ్చే నెల మొదట్లో యూనిట్ అంతా కేరళ వెళ్లే అవకాశం ఉంది. అంతే కాక మేకర్స్ ఈ సినిమాని రెండు నెలల్లోనే పూర్తి చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఎలాగూ ఇప్పటికే రైట్స్ కి భారీగా ఖర్చు పెట్టారు కాబట్టి కాస్త తక్కువ బడ్జెట్ లోనే షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. 


సినిమా కథ ప్రకారం అయితే పెద్దగా బడ్జెట్ పడాల్సిన పని కూడా లేదు. కేవలం ఒక పోలీస్ స్టేషన్ సెటప్ అలాగే ఒక లాడ్జ్ సెటప్ ఉంటే ఈ సినిమా పూర్తి అయి పోతుంది. ఇప్పటికే లాడ్జి కోసం సెట్ వేసారు అని కూడా ప్రచారం జరుగుతోంది. ఇక అంతే కాక ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ కంటే తెలుగు వర్షన్ లో నిడివి తక్కువ ఉండేలా గా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఒరిజినల్ వెర్షన్ దాదాపుగా మూడు గంటల పాటు ఉంటుంది దానిని చాలావరకు తగ్గించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: