మధ్యలో ఎన్నో షోలను హోస్ట్ చేసిన ఆమె... ఏడేళ్లుగా జబర్ధస్త్కు జడ్జ్గా కొనసాగుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఆ షోకు పెద్ద దిక్కుగా నిలుస్తున్నారు.సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉన్న సమయంలోనే రోజా రాజకీయాల్లోకీ ఎంటర్ అయింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించిన ఈ హీరోయిన్.. కొన్నేళ్ల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఈ పార్టీ నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందింది. తన నియోజకవర్గ అభివృద్ధి చూసుకుంటూనే.. కెరీర్ను కూడా సక్సెస్ఫుల్గా నడుపుకుంటోంది.సంక్రాంతి సందర్భంగా రోజా తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ చానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఈ సందర్భంగా తెలుగు సినిమా రంగంతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన అభిమాన హీరో గురించి చెబుతూ.. 'తెలుగులో చాలా మంది ఫేవరెట్ హీరోలు ఉన్నారు. ఇప్పుడున్న వారిలో అయితే మాత్రం రవితేజ అంటే ఇష్టం. అతడివి అన్ని సినిమాలూ చూస్తాను' అని పేర్కొంది..ఇక తన సినిమా విషయాల గురించి మాట్లాడుతూ.." నేను ఈ మధ్య సినిమాలు చేయట్లేదని అంతా అడుగుతున్నారు. వాస్తవానికి నాకో స్టైల్ ఉంది. అది ఇప్పుడు వర్కౌట్ కాదు. ఇప్పటి వాళ్లు నాలా ట్రై చేయడం లేదు..అందుకే నేను సినిమాలు చేయట్లేదు అంటూ బదులిచ్చింది రోజా...!!