క్రాక్ సినిమాకి థియేటర్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ క్రాక్ డిస్ట్రిబ్యూటర్ శ్రీను తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఇతని ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు నిర్మాత, 'మాస్టర్' మూవీ డిస్ట్రిబ్యూటర్ మహేష్ కోనేరు. ఈ ఇష్యూపై శుక్రవారం నాడు ప్రెస్ మీట్ నిర్వహించి వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. 'ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో విడుదలైన మాస్టర్ చిత్రం 13న విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో విజయ్ కెరియర్‌లో బెస్ట్ రెవెన్యూ రావడం సంతోషంగా ఉంది. ఈ చిత్ర విజయం పట్ల విజయ్ గారు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక థియేటర్స్ వివాదం విషయానికి వస్తే.. కరోనా తరువాత మన తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది.


 ఈ సంక్రాంతికి అందరికీ డబ్బులు వస్తున్నాయి.అయితే క్రాక్ డిస్ట్రిబ్యూటర్ ఎందుకు అలా మాట్లాడారో నాకు తెలియదు. ఏదైనా ఉంటే మాట్లాడి సాల్వ్ చేసుకోవాలి. అంతేతప్ప పర్సనల్ ఎటాక్ చేయకూడదు. క్రాక్ సినిమా నైజాంలో జనవరి 9న విడుదలైనప్పుడు 300-325 థియేటర్స్‌లో విడుదలైంది.నాలుగు రోజులు బ్రహ్మాండంగా ఆడింది. ఇక మాస్టర్ విషయానికి వస్తే.. అది పాన్ ఇండియా ఫిల్మ్ కాబట్టి అన్ని చోట్లా ఒకేరోజు విడుదల కావాలి.ముందుగానే జనవరి 13 ఫిక్స్ చేశాం.థియేటర్లు ఎవరికి ఎన్ని అనేవి అప్పుడే ఫిక్స్ అయ్యింది. డిస్ట్రిబ్యూటర్స్ ముందే చెప్పారు. ఓపినింగ్ రోజు ఎక్కువ థియేటర్స్ పెడతాం కానీ.. మిగతా సినిమాలు ఉన్నాయి కాబట్టి..థియేటర్స్ తగ్గిస్తాం అన్నారు. అట్లాగే.. ఫస్ట్ డే మాస్టర్ చిత్రానికి నైజాంలో 150 థియేటర్స్ వరకూ ఇచ్చారు.

 

కానీ సెకండ్ డే..70-80కి పడిపోయింది. అయినాసరే కలెక్షన్లు బాగానే వచ్చాయి. ఎప్పుడైతే రెడ్, అల్లుడు అదుర్స్ వచ్చాయో.. క్రాక్‌కి 100-120 స్క్రీన్స్ ఉంచారు.పండగ టైంలో అందరూ స్క్రీన్స్ పంచుకోవాలి. అంతేతప్ప తమిళ సినిమా, డబ్బింగ్ సినిమా అంటే కరెక్ట్ కాదు. అన్ని సినిమాలు బాగానే ఆడుతూ డబ్బులు వస్తున్న సందర్భంలో దీన్ని వివాదం చేయడం కరెక్ట్ కాదు.దిల్ రాజు, శిరీష్‌లు డిస్ట్రిబ్యూటర్స్‌ని ఇబ్బంది పెడుతున్నారంటే నేను ఒప్పుకోను. నాకు 118 సినిమా ఇచ్చి ఎంకరేజ్ చేశారు. ఆయన గురించి ఇండస్ట్రీలో ఎవర్ని అడిగినా చెప్తారు. ఎవర్నైనా మర్యాదగానే చూస్తారు' అంటూ చెప్పుకొచ్చాడు మహేష్ కోనేరు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: