పుష్ప సినిమా కంప్లీట్ అయిన వెంటనే బన్నీ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తోన్న కొరటాల.. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న వెంటనే బన్నీ సినిమాను లైన్లో పెట్టేలా ప్లాన్ చేస్తున్నాడు. బన్నీ తన కెరీర్లో ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్ని కంప్లీట్ ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్లుగానే తెరకెక్కాయి. అయితే కొరటాల డైరెక్ట్ చేసే సినిమా మాత్రం పొలిటికల్ జానర్లో ఉంటుందని తెలుస్తోంది.
కొరటాల బన్నీ కోసం అదిరిపోయే పొలిటికల్ థ్రిల్లర్ లైన్ను ఎంచుకున్నాడని అంటున్నారు. పుష్ప ఏకంగా పాన్ ఇండియా లెవల్లో ఐదు భాషల్లో తెరకెక్కుతోంది. ఈ క్రమంలోనే కొరటాల తెరకెక్కించే సినిమాను సైతం బాలీవుడ్లో రిలీజ్ చేయడంతో పాటు పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించేలా ముందుగానే ప్లానింగ్ చేస్తున్నారు. బాలీవుడ్లోనూ ఈ సినిమాకు క్రేజ్ వచ్చేందుకే బాలీవుడ్ హీరోయిన్ను ఈ సినిమాలో తీసుకోవాలని కొరటాల - బన్నీ డిసైడ్ అయ్యారట.
వరుణ్ తేజ్ తో బాక్సర్ సినిమాలో జతకట్టిన సాయిమంజ్రేకర్ ను చిత్రబృందం ఫైనల్ చేసే ఆలోచనలో ఉందట. ఈ విషయం పై త్వరలోనే అధికారికంగా ప్రకటన రానుంది.