అల్లు అర్జున్ గ‌తేడాది అల వైకుంఠ‌పురంలో లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌తో త‌న రేంజ్‌ను డ‌బుల్ చేసేసుకున్నాడు. అంత‌కు ముందు యేడాదిన్న‌ర పాటు గ్యాప్ తీసుకున్న బ‌న్నీ ఈ సినిమా త‌ర్వాత మ‌రో యేడాదిన్న‌ర పాటు గ్యాప్ తీసుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి. అల వైకుంఠ‌పురంలో సినిమా నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను మొత్తం బీట్ చేసేసింది. ప్ర‌స్తుతం బ‌న్నీ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమాలో న‌టిస్తున్నాడు. రంగ‌స్థ‌లం లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావ‌డంతో పుష్పై భారీ అంచ‌నాలే ఉన్నాయి. పైగా ఇటు బ‌న్నీ, అటు సుక్కు ఇద్ద‌రూ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌తో మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇప్పుడు వీరి కాంబినేష‌న్లో సినిమా కావ‌డంతో పుష్ప ఖ‌చ్చితంగా మ‌రో ఇండ‌స్ట్రీ హిట్ గా నిలుస్తుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి.

పుష్ప సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే బ‌న్నీ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకు క‌మిట్ అయ్యాడు. ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తోన్న కొర‌టాల‌.. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న వెంట‌నే బ‌న్నీ సినిమాను లైన్లో పెట్టేలా ప్లాన్ చేస్తున్నాడు. బ‌న్నీ త‌న కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సినిమాలు అన్ని కంప్లీట్ ఫ్యామిలీ, కామెడీ ఎంట‌ర్టైన‌ర్లుగానే తెర‌కెక్కాయి. అయితే కొర‌టాల డైరెక్ట్ చేసే సినిమా మాత్రం పొలిటిక‌ల్ జాన‌ర్‌లో ఉంటుంద‌ని తెలుస్తోంది.

కొర‌టాల బ‌న్నీ కోసం అదిరిపోయే పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ లైన్‌ను ఎంచుకున్నాడ‌ని అంటున్నారు. పుష్ప ఏకంగా పాన్ ఇండియా లెవ‌ల్లో ఐదు భాష‌ల్లో తెర‌కెక్కుతోంది. ఈ క్ర‌మంలోనే కొర‌టాల తెర‌కెక్కించే సినిమాను సైతం బాలీవుడ్‌లో రిలీజ్ చేయ‌డంతో పాటు పాన్ ఇండియా రేంజ్‌లో తెర‌కెక్కించేలా ముందుగానే ప్లానింగ్ చేస్తున్నారు. బాలీవుడ్‌లోనూ ఈ సినిమాకు క్రేజ్ వ‌చ్చేందుకే బాలీవుడ్ హీరోయిన్‌ను ఈ సినిమాలో తీసుకోవాల‌ని కొర‌టాల - బ‌న్నీ డిసైడ్ అయ్యార‌ట‌.

వరుణ్ తేజ్ తో బాక్సర్ సినిమాలో జతకట్టిన సాయిమంజ్రేకర్ ను చిత్రబృందం ఫైనల్ చేసే ఆలోచనలో ఉందట. ఈ విషయం పై త్వరలోనే అధికారికంగా ప్ర‌క‌ట‌న రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: